Earthquake: ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.1గా నమోదు..!!

Earthquake: ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.1గా నమోదు..!!
x
Highlights

Earthquake: ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.1గా నమోదు..!!

Earthquake: భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలు సోమవారం తెల్లవారుజామున భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ముఖ్యంగా అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిద్రలో ఉన్నవారు ఒక్కసారిగా కుదుపులను అనుభవించడంతో, పరిస్థితి అర్థం కాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అధికారుల సమాచారం ప్రకారం, అస్సాంలోని మోరిగావ్ జిల్లాకేంద్రంగా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం సోమవారం ఉదయం సరిగ్గా 4 గంటల 17 నిమిషాల సమయంలో సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం భూమికి సుమారు 50 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.

అదే సమయంలో త్రిపుర రాష్ట్రంలోని గోమతి జిల్లాలో కూడా భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి. అక్కడ భూకంప తీవ్రత 3.9గా నమోదైనట్లు సమాచారం. ఈ కుదుపుల ప్రభావం అస్సాంలోనే కాకుండా మేఘాలయ, అరుణాచలప్రదేశ్‌తో పాటు ఈశాన్య ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. పలుచోట్ల భవనాలు స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయంతో బయటకు వచ్చారు.

అయితే ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భూకంపం తరువాత కూడా ఎలాంటి అనంతర ప్రకంపనలు నమోదుకాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధిత శాఖలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories