Kangana Ranaut: చిక్కుల్లో కంగనా రౌనత్..ఎన్నికపై హైకోర్టులో పిటిషన్

High Court notices to Mandi BJP MP Kangana Ranaut
x

Kangana Ranaut: చిక్కుల్లో కంగనా రౌనత్..ఎన్నికపై హైకోర్టులో పిటిషన్

Highlights

Kangana Ranaut:హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోకసభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ చిక్కుల్లో పడ్డారు . ఆమె ఎన్నికను సభ్యత్వాన్ని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశారు. దీంతో హైకోర్టు కంగనాకు నోటీసులు జారీచేసింది. ఆగస్టు 21వ తేదీలోగా సమాధానం వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

Kangana Ranaut:హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఎన్నికను హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్‌కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కిన్నౌర్ నివాసి లైక్ రామ్ నేగి ఈ పిటిషన్ దాఖలు చేశారు. కంగనా ఎన్నికను రద్దు చేయాలని లైక్ రామ్ నేగి అభ్యర్థిస్తూ, ఈ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పిటిషనర్ వేసిన నామినేషన్ పత్రాన్ని తప్పుగా తిరస్కరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీంతో ఆగస్టు 21లోగా సమాధానం ఇవ్వాలని కంగనా రనౌత్‌కు నోటీసులు జారీ చేస్తూ జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ ఆదేశాలు జారీ చేశారు. మండి లోక్‌సభ స్థానం నుంచి రనౌత్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సింగ్‌కు 4,62,267 ఓట్లు రాగా, కంగనాకు 5,37,002 ఓట్లు వచ్చాయి. రనౌత్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ, పిటిషనర్ లైక్ రామ్ నేగి తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి (డిప్యూటీ కమిషనర్, మండి) అక్రమంగా తిరస్కరించారని లాయక్ ఆరోపించారు.

అటవీ శాఖ మాజీ ఉద్యోగి లైక్ రామ్ నేగి మాట్లాడుతూ, తనకు ముందస్తుగా పదవీ విరమణ పొందానని, రిటర్నింగ్ అధికారి ముందు నామినేషన్ పత్రాలతో పాటు డిపార్ట్‌మెంట్ నుండి నో-డ్యూస్ సర్టిఫికేట్‌ను సమర్పించినట్లు చెప్పారు. అయితే విద్యుత్‌, జలమండలి, టెలిఫోన్‌ శాఖల నుంచి ఎలాంటి బకాయిలు లేని సర్టిఫికెట్లు సమర్పించేందుకు ఒక్కరోజు గడువు ఇవ్వగా, వాటిని సమర్పించినా రిటర్నింగ్‌ అధికారి అంగీకరించకపోవడంతో నామినేషన్‌ పత్రాలను రద్దు చేశారు. తన పత్రాలను ఆమోదించినట్లయితే తాను ఎన్నికల్లో గెలిచి ఉండేవాడినని, కంగనా ఎన్నికను రద్దు చేయాలని ఆయన వాదించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories