దేశంలో విజృంభించనున్న కరోనా థర్డ్‌వేవ్..ఫిబ్రవరిలో పతాకస్థాయిలో కేసులు

IIT Kanpur Researchers has Revealed Corona Third Wave Will Effect by February First Week
x

దేశంలో విజృంభించనున్న కరోనా థర్డ్‌వేవ్

Highlights

ఐఐటీ కాన్పూర్ పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడి గసియాన్ మిశ్రమ నమూనా విధానంలో గణించిన పరిశోధకులు

Corona Third Wave: భారత్ లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ కాన్పూర్ తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో కరోనా మూడో వేవ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నాటికి పతాకస్థాయికి చేరుతుందని ఆ అధ్యయనంలో అంచనా వేశారు. భారత్ లో తొలి రెండు కరోనా వేవ్ ల సమయంలో నమోదైన కేసుల సంఖ్యను గసియాన్ మిశ్రమ నమూనా విధానంలో గణించి ఈ విషయాన్ని తేల్చారు.

ప్రపంచంలో ఇప్పటికే బ్రిటన్, అమెరికా, రష్యా, జర్మనీ వంటి దేశాల్లో కరోనా థర్డ్ వేవ్ గరిష్ఠ స్థాయిలో నడుస్తోంది. ఈ సందర్భంగా ఆయా దేశాల కరోనా కేసుల సరళిని కూడా పరిశీలించారు. భారత్ లో తొలి రెండు వేవ్ ల సమయంలో నమోదైన కేసుల సంఖ్యతో ఆయా దేశాల కరోనా డేటాతో క్రోడీకరించారు. అయితే వ్యాక్సినేషన్ అంశాన్ని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకోలేదు. అందువల్ల ఫిబ్రవరి నాటికి ఎన్ని కేసులు వస్తాయన్నదానిపై తాజా అధ్యయనంలో పేర్కొనలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories