Viral Video: 4,000 మంది విద్యార్థులు, 5,000 దీపాలతో గణేశుడి అద్భుత రూపం.. వీడియో వైరల్


Viral Video: 4,000 మంది విద్యార్థులు, 5,000 దీపాలతో గణేశుడి అద్భుత రూపం.. వీడియో వైరల్
కర్ణాటక రాష్ట్రం, కొప్పళ జిల్లా గంగావతి తాలూకా శ్రీరామనగరం విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినాయక చవితి వేడుకలను విభిన్నంగా జరిపి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వేడుకలో 4,000 మంది విద్యార్థులు కలిసి గణేశుడి భారీ ఆకృతిని రూపొందించారు. దానిపై 5,000 దీపాలను వెలిగించి అద్భుత దృశ్యాన్ని సృష్టించారు.
కర్ణాటక రాష్ట్రం, కొప్పళ జిల్లా గంగావతి తాలూకా శ్రీరామనగరం విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినాయక చవితి వేడుకలను విభిన్నంగా జరిపి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వేడుకలో 4,000 మంది విద్యార్థులు కలిసి గణేశుడి భారీ ఆకృతిని రూపొందించారు. దానిపై 5,000 దీపాలను వెలిగించి అద్భుత దృశ్యాన్ని సృష్టించారు.
డ్రోన్ కెమెరాతో పై నుంచి ఈ దృశ్యాలను చిత్రీకరించగా.. వెలుగుల కాంతిలో గణేశుడి రూపం మరింత అందంగా కనిపించింది. ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు పర్యావరణహిత గణేశ విగ్రహాలను కూడా తయారు చేశారు.
పాఠశాల అధ్యక్షుడు నెక్కంటి సూరిబాబు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో పర్యావరణంపై అవగాహన పెంపొందించడమే కాకుండా, వారి సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యమని తెలిపారు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వినూత్న వేడుకలో విద్యార్థుల సమిష్టి కృషి అందరినీ ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ అద్భుత దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#Koppal #Karnataka #GaneshChaturthi2025
— Amit Upadhye (@AmitSUpadhye) August 25, 2025
4,000 students of
Vidyaniketan School in #Gangavai participates in making a part of large Lord Ganesha drawing at their campus #watch don't miss the night drone view! @NewIndianXpress @XpressBengaluru @KannadaPrabha @raghukoppar pic.twitter.com/rgUwn8CCY5

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire