దేశంలో ఉగ్ర భూతం కొత్త రూపం తీసుకుందా..? వైట్ కాలర్ ఉద్యోగస్థులు సైతం ట్రెరర్ యాక్టివిటీస్‌ పట్ల ఆకర్షితులు..?

దేశంలో ఉగ్ర భూతం కొత్త రూపం తీసుకుందా..? వైట్ కాలర్ ఉద్యోగస్థులు సైతం ట్రెరర్ యాక్టివిటీస్‌ పట్ల ఆకర్షితులు..?
x

దేశంలో ఉగ్ర భూతం కొత్త రూపం తీసుకుందా..? వైట్ కాలర్ ఉద్యోగస్థులు సైతం ట్రెరర్ యాక్టివిటీస్‌ పట్ల ఆకర్షితులు..?

Highlights

దేశంలో ఉగ్ర భూతం కొత్త రూపం తీసుకుందా..? భారత నిఘా వర్గాలకు చిక్కకుండా దాడులు చేసేందుకు టెర్రర్‌ నెట్‌వర్క్ కొత్త వ్యూహాలను అమలు చేస్తుందా..?

దేశంలో ఉగ్ర భూతం కొత్త రూపం తీసుకుందా..? భారత నిఘా వర్గాలకు చిక్కకుండా దాడులు చేసేందుకు టెర్రర్‌ నెట్‌వర్క్ కొత్త వ్యూహాలను అమలు చేస్తుందా..? నిన్నటి వరకు ఉగ్ర కార్యకలాపాలకు కొన్ని వర్గాలకు చెందిన పేద, మధ్య తరగతి యువతకు డబ్బు ఆశ చూపి.. వారి బ్రెయిన్ వాష్ చేసి దేశంలో అశాంతి సృష్టించాలని కుట్రలు చేసే టెర్రర్ గ్రూప్‌లు ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నాయా..? వైట్ కాలర్ ఉద్యోగస్తులు సైతం ట్రెరర్ యాక్టివిటీస్‌ పట్ల ఆకర్షితులు అవుతున్నారా..? ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబ్‌ పేలుడు, అంతకు ముందు ఫరీదాబాద్‌లో ఉగ్ర లింకులను చూస్తే ఇలాంటి డౌట్సే వస్తున్నాయి. నలుగురు డాక్టర్లు సైతం ఉగ్రవాద లింకులో భాగం కావడం, వారి వద్ద పెద్ద ఎత్తున పేలుడు పదారాలు స్వాధీనం చేసుకోవడం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. భారత్‌లో పేలుళ్లే లక్ష్యంగా ఉగ్ర సంస్థలు ఉన్నత ఉద్యోగస్థులను టార్గెట్ చేసి సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా ఆకర్షించి.. వారితో తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నాయి ఉగ్రసంస్థలు.

పెరిగిన టెక్నాలజీతో దేశంలో యాంటీ టెర్రర్ నెట్‌వర్క్ పటిష్టంగా మారింది. ఫలితంగా భారత్‌లో గత కొన్ని ఏండ్లుగా ఉగ్రదాడులు చాలా వరకు తగ్గాయి. ఉగ్ర కుటలను ముందే గుర్తించి.. భగ్నం చేస్తున్నాయి భద్రతా సంస్థలు. నిన్నటి వరకు టెర్రర్ యాక్టివిటీస్ వైపు కొన్ని వర్గాలకు చెందిన పేద, మధ్య తరగతి యువతే పెద్దగా ఆకర్షితులు అయ్యేవారు. వారి ఆర్ధిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని.. డబ్బును వలగా విసిరి టెర్రరిజం వైపు ఆకర్షితులు అయ్యేలా బ్రెయిన్ వాష్ చేసి.. పేలుళ్లకు, దాడులకు పాల్పడేలా ఉపయోగించుకునేవారు. స్లిపర్స్‌ సెల్స్‌ను తయారు చేసేవారు. ఐతే ఇటీవల కాలంలో అలాంటి అనుమానితులపై నిఘా పెరిగింది. సోషల్ మీడియాలో అనుమానంగా కనిపించే ఖాతాలను, విదేశీ వ్యక్తులతో సంప్రదింపులు జరిగే పోస్టులపై నిఘా పెట్టి.. కుట్రలను చేధిస్తున్నారు. ఇలా ఓ వైపు ఉగ్రవాదుల కార్మాగారంగా ఉన్న పాకిస్తాన్‌, ఇతర పక్క దేశాల నుంచి చొరబడే టెర్రరిస్టులను అడ్డుకోవడంతో పాటు.. భారత్‌లోని ఉగ్ర నీడలను గుర్తించి.. ఆడ్డుకుంటున్నాయి. దీంతో ఉగ్ర సంస్థలు కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా ఉన్నత ఉద్యోగస్తులను తమ లక్ష్యాలకు టార్గెట్‌గా ఎంచుకుంటున్నాయి. వారిలో విష బీజాలు నాటి.. దాడులకు ప్రోత్సహిస్తున్నాయి.

అత్యంత ప్రమాదకరంగా దేశంలో కొత్త రూపంలో వేళ్లూనుకుంటున్న వైట్‌ కాలర్‌ ఉగ్రవాదానికి కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలతో కలిసి జమ్మూకశ్మీర్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. దేశ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 15 రోజుల పాటు అత్యంత పకడ్బందీగా నిర్వహించిన ఆపరేషన్‌లో జైషే మహ్మద్‌, అన్సార్‌ ఘజవత్‌ ఉల్‌ హింద్‌ సంస్థలకు చెందిన 8 మంది ఉగ్రదులను అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు వైద్యులు ఉండటం, వారిలో ఒక మహిళ కూడా ఉండటంకలకలం రేపుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో అరెస్టు చేసిన డాక్టర్‌తో కలుపుకుంటే ఈ ఉగ్రనెట్‌వర్క్‌లో అరెస్టు అయిన వైద్యుల సంఖ్య నాలుగుకు పెరిగింది. అరెస్టయిన వారిలో ఏడుగురు జమ్మూకశ్మీర్‌కు చెందినవారే ఉన్నారు. వీరి నుంచి మొత్తం 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూకశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. ఇందులో అమోనియం నైట్రేట్‌, పొటాషియం నైట్రేట్‌, సల్ఫర్‌ వంటి పదార్థాలు ఉన్నాయి. ఒక ఏకే 56, ఒక ఏకే క్రింకోవ్‌ తుపాకితోపాటు చైనీస్‌ స్టార్‌, బెనెట్టా పిస్తోళ్లు, బాంబుల తయారీలో ఉపయోగించే బ్యాటరీలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.

శ్రీనగర్‌లో అక్టోబర్‌ 19న జైషే మహ్మద్‌కు మద్దతుగా వెలసిన పోస్టర్లపై కూపీ లాగడంతో ఈ భారీ ఉగ్ర నెట్‌వ ర్క్‌ బట్టబయలైంది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెరగటంతో పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్‌తోపాటు, భారత్‌లో ISISకు అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ కొత్త మార్గాలను అనుసరిస్తున్నట్లు ఈ కేసు తేటతెల్లం చేసింది. సమాజంలో మంచి పేరున్నవారు, ఉన్నత విద్యావంతులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు తేలింది. అరెస్టయిన ఉగ్రవాదులు చారిటీలు, విద్యా సంస్థలకు నిధుల సేకరణ ముసుగులో ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారని జమ్ముకశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. ‘దేశంలో వైట్‌కాలర్‌ ఉగ్రవాద వ్యవస్థ క్రమంగా వేళ్లూనుకుంటున్నట్లు ఈ దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదంవైపు ఆకర్షితులైన ప్రొఫెసర్లు, విద్యార్థులు పాకిస్థాన్‌, ఇత విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారు. ప్రొఫెషనల్‌, విద్యా సంస్థల ద్వారా నిధులు సమీకరిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు, ఐఈడీ బాంబులు తయారు చేసే పేలుడు పదార్థాలు, ఇతర మౌలిక వసతులు సమకూరుస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాకు చెందిన ఓ ఉగ్రవాది... అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో గత ఏడాది అక్టోబర్‌ 24 వరకు రెసిడెంట్‌ డాక్టర్‌గా పనిచేశాడు. ఇతడికి జైషే మహ్మద్‌తోపాటు ఏజీయూహెచ్‌తోనూ సంబంధాలున్నట్లు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఈ నెల 6న అతన్ని అరెస్టు చేశారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన మరోవ్యక్తి... హర్యానాలోని ధౌజ్‌లో ఉన్న అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ అక్కడే రెండు వేర్వేరు ఇళ్లను అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఇతడి వద్దనే బాంబుల తయారీకి ఉపయోగించే సామగ్రి భారీ మొత్తంలో పట్టుబడింది. అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీలోనే పనిచేస్తున్న మరో మహిళా డాక్టర్‌ను కూడా ఈ నెల 7న అరెస్టు చేశారు. ఆమె కారులో అసాల్ట్‌ రైఫిల్‌ లభించటం గమనార్హం. ఇక హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు ఇంట్లో సొంతంగానే రెసిన్‌ అనే విషపదార్థం తయారుచేస్తున్నట్లు గుర్తించారు. వైట్ కాలర్ జాబ్ ముసుగులో ఉగ్రవాదం చేస్తోన్న భారీ కుట్రను చేధించినప్పటికీ.. దురద్రుష్టవశాత్తు ఢిల్లీలో కారు బాంబ్ పేలి.. 12 మంది వరకు అమాయకులు మరణించారు. ఐతే ఢిల్లీలో బ్లాస్ట్‌కు పాల్పడిన అనుమానితుడికి.. ఫరీదాబాద్‌లో పట్టుబడ్డ వారికి లింకులు ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories