PM JAY Scheme: ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల బెనిఫిట్... కష్టకాలంలో ఉపయోగపడుతున్న స్కీమ్

PM JAY Scheme: ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల బెనిఫిట్... కష్టకాలంలో ఉపయోగపడుతున్న స్కీమ్
x
Highlights

PM JAY: ఆయుష్మాన్ భారత్ లక్ష్యాలను అందుకునే ప్రణాళికల్లో భాగంగా కేంద్రం ఈ ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ తీసుకొచ్చింది.

PMJAY Scheme: ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద కేంద్రం ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల హెల్త్ కార్డ్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతున్న రాష్ట్రాల జాబితాను కేంద్రం ప్రకటించింది. ఆ జాబితాలో దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో దక్షిణాది నుండే 4 రాష్ట్రాలున్నాయి. గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుండి ఈ స్కీమ్‌ను ఉపయోగించుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆ జాబితాను చూస్తే అర్థమవుతోంది.

2018 లో ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 11 కోట్ల మంది ఈ పథకంలో చేరారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి కోసం రూ. 1.29 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ సందర్భంగా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PM JAY స్కీమ్ ప్రారంభం

2018 సెప్టెంబర్ 23న జార్ఖండ్‌లోని రాంఛీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ స్కీమ్ ప్రారంభమైంది. ఆయుష్మాన్ భారత్ లక్ష్యాలను అందుకునే ప్రణాళికల్లో భాగంగా కేంద్రం ఈ ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద పేరు నమోదు చేసుకున్న వారికి ఆయుష్మాన్ కార్డు ఇస్తారు.

ప్రయోజనాలు

ఏ ఏడాదికి ఆ ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సహాయం.

ఒక కుటుంబంలో ఇంతమంది సభ్యులకే వర్తిస్తుంది అనే నిబంధన, పరిమితులు లేవు. ఒక కుటుంబంలో ఎంతమంది అయినా ఈ ఉచిత ఆరోగ్య బీమా కింద తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.

ఇది కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ హెల్త్ కార్డు ఉపయోగించి దాని అనుబంధ ఆస్పత్రులలో నగదు చెల్లించకుండా ఉచితంగా చికిత్స పొందే అవకాశం ఉంది.

ఆస్పత్రిలో చేరడానికు 3 రోజుల ముందు, ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన తరువాత 15 రోజులలో అవసరమయ్యే వైద్య పరీక్షలు, మెడిసిన్ లాంటివి కలిపి అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.

వయస్సు పరిమితి, లింగ బేధం లేకుండా ఎవరైనా ఈ హెల్త్ స్కీమ్‌లో చేరవచ్చు.

దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్స్

పీఎం జన్ ఆరోగ్య యోజన పథకం కింద తమ పేరు నమోదు చేసుకోవాలనే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారి ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెసిడెన్షియల్ ప్రూఫ్, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories