PM Kisan Yojana: రైతుల నిరీక్షణకు తెర.. శుభవార్త చెప్పనున్న ప్రధాని మోదీ

PM Kisan Yojana
x

PM Kisan Yojana: రైతుల నిరీక్షణకు తెర.. శుభవార్త చెప్పనున్న ప్రధాని మోదీ

Highlights

PM Kisan Yojana: కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత ఫిబ్రవరి 23న అంటే నేడు విడుదల కానుంది.

PM Kisan Yojana: కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత ఫిబ్రవరి 23న అంటే నేడు విడుదల కానుంది. ఫిబ్రవరి 23న ప్రధాని మోదీ బీహార్‌లోని భాగల్పూర్ నుండి దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతుల ఖాతాలకు 19వ విడతను నేరుగా ట్రాన్స్ ఫర్ చేస్తారు. రైతులకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం 18వ విడత అక్టోబర్ 2024లో విడుదలైంది.

రైతుల ఆదాయాన్ని పెంచడానికి, ఈ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి రూ. 2,000 ఇస్తుంది. ఏడాది పొడవునా మూడు వేర్వేరు వాయిదాలలో మొత్తం 6 వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాకు నేరుగా బదిలీ చేస్తారు. 19వ విడత KYC చేసిన రైతులకు మాత్రమే ఈ నగదు లభిస్తుంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రైతులు KYC చేయడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది.


ఫిబ్రవరి 24న బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి 19వ విడత పీఎం కిసాన్‌ను విడుదల చేస్తారు. ఇక్కడ 9.8 కోట్ల మంది రైతులకు మొత్తం రూ.22,000 కోట్లు విడుదల చేయనున్నారు. 18వ విడతలో లబ్ధిదారుల సంఖ్య రూ.9.6 కోట్లు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద ఇప్పటివరకు మొత్తం రూ.3.46 లక్షల కోట్లను మంజూరు చేశారు. వచ్చే వారం 19వ విడత విడుదల తర్వాత ఈ మొత్తం రూ.3.68 లక్షల కోట్లకు పెరుగుతుంది.

ప్రధాన మంత్రి కిసాన్ యోజన స్టేటస్ ఇలా చెక్ చేయండి

* ముందుగా మీరు PM కిసాన్ యోజన pmkisan.gov.in అధికారిక పోర్టల్‌కి వెళ్లండి.

* దీని తరువాత, ఇప్పుడు మీరు నో యువర్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

* దీని తర్వాత ఒక కొత్త విండో తెరుచుకుంటుంది.

* ఇప్పుడు మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి.

* దీని తర్వాత మీరు గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.

* మీరు OTP ఎంటర్ చేసిన వెంటనే మీ స్టేటస్ మీకు కనిపిస్తుంది.

ప్రధాన మంత్రి కిసాన్ యోజనకు అవసరమైన పత్రాలు

ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు భూమి యాజమాన్య పత్రాలు మొబైల్ నంబర్

Show Full Article
Print Article
Next Story
More Stories