PM MODI TOUR: ఈ సారి ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ.. జులై 2 నుంచి టూర్ స్టార్ట్


PM MODI TOUR: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సారి ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. జులై 2 నుంచి 9 వరకు వివిధ దేశాల్లో తిరగనున్నారు. ఆయా దేశాల అధినేతలను కలిసి, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచనున్నారు.
PM MODI TOUR: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సారి ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. జులై 2 నుంచి 9 వరకు వివిధ దేశాల్లో తిరగనున్నారు. ఆయా దేశాల అధినేతలను కలిసి, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచనున్నారు. ఈ ట్రిప్లో మూడు దేశాల్లో మోదీ తొలిసారి పర్యటించనున్నారు. వివరాల్లోకి వెళ్లితే..
ప్రధాని నరేంద్ర మోదీ ఈ సారి ఐదు దేశాల్లో తిరగనున్నారు. జులై 2 నుంచి 9 వరకు ఘనా, ట్రినిడాడ్, అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటనలో మోదీ బిజీ కానున్నారు. మొదట అంటే జులై 2 నుంచి 3 వ తేదీ వరకు మోదీ ఘనాలో పర్యటిస్తారు. దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత మోదీ ఒక ప్రధాని హోదాలో పర్యటించడం విశేషం. ఈ దేశంతో ఆర్థిక, రక్షణ, ఇంధన రంగాలు వంటి ద్వైపాక్షిక ఒప్పందాలపై మోదీ చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు రెండు దేశాలకు చాలా అవసరం. ఈ చర్చల ద్వారా పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్ధిక సంఘం, ఆఫ్రికన్ యూనియన్తో భారత దేశ సంబంధాలు మరింత బలపడతాయి.
ట్రినినాడ్ అండ్ టోబాగో పర్యటన
జులై 2 , 3 తేదీలో ఘనాలో పర్యటించిన తర్వాత అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టోబాగోకు వెళ్లనున్నారు. ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్ బిస్సేసర్ను కలిసి దైపాక్షిక చర్చలు జరపనున్నారు. అయితే ప్రధాని మోదీ ఈ దేశంలో పర్యటించడం ఇదే మొదటి సారి. అంతేకాదు 1999 తర్వాత T&Tకు ప్రధాన మంత్రి స్థాయిలో చేస్తున్న తొలి ద్వైపాక్షిక పర్యటన కూడా. ఈ చర్చలు, ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్తో పాటు అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లతో కూడా మోదీ చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నాయి.
అర్జెంటీనా పర్యటన
మూడో విదేశీ పర్యటనగా మోదీ జులై 4, 5 తేదీల్లో అర్జెంటీనాలో పర్యటించనున్నారు. రక్షణ, మైనింగ్, వ్యవసాయం, చమురు, గ్యాస్ , ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజా సంబంధాలు వంటి పలు కీలక రంగాలపై ఇరుదేశాలు చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఈ రెండు దేశాల ప్రధానులు చర్చలు జరుపుతారు.
బ్రెజిల్ పర్యటన
అర్జెంటీనా తర్వాత ప్రధాని మోదీ బ్రెజిల్లో పర్యటిస్తారు. బ్రెజిల్లో మూడు రోజులు పాటు ఉంటారు. అంటే జూలై 5 నుంచి 8 వరకు ఈ దేశంలో తిరగనున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాను కలిసి పలు కీలక విషయాలపై చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఆ దేశంలో జరిగే 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడితో కలిసి పాల్గొననున్నారు. శాంతి భద్రతలు, ఏఐ, వాతావరణం, ప్రపంచ ఆరోగ్యం, ప్రపంస్థ ఆర్ధిక విషయాలపై మోదీ ఈ బ్రిక్స్ సమావేశంలో మాట్లాడనున్నారు. అదేరోజు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులతో కలిసి కూడా ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత రోజు బ్రెజిల్, ఇండియాకు సంబంధిన పలు కీలక అంశాలపై చర్చలు జరిపి, ఒప్పంద పత్రాలపై ఇరుదేశాల ప్రదానులు సంతకాలు చేయనున్నారు.
నమీబియా పర్యటన
మోదీ విదేశీ పర్యటనలో చివరి పర్యటన నమీబియా. జులై 9న మోదీ ఈ దేశంలో పర్యటించనున్నారు. మొదటిసారి మోదీ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నమీబియా వ్యవస్థస్థాపక పితామహుడు ఆ దేశ మొదటి అధ్యక్షుడు డాక్టర్ సామ్ నుజోమాకు ఆ దేశా పార్లమెంట్లో ప్రసంగించి నివాళులు అర్పించనున్నారు. ఇరుదేశాల మధ్య బంధాలు మరింత బలపడే విధంగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.
దాదాపు 8 ఎనిమిది రోజుల పాటు 5 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది రెండో విదేశీ పర్యటన కావడం విశేషం.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire