PSBs Merger: పీఎస్‌బీలు నాలుగే మిగిలేనా? మేగావిలీనంపై ప్రభుత్వ సీరియస్ సిగ్నల్స్?

PSBs Merger: పీఎస్‌బీలు నాలుగే మిగిలేనా? మేగావిలీనంపై ప్రభుత్వ సీరియస్ సిగ్నల్స్?
x
Highlights

Public Sector Banks Merger News — ప్రభుత్వం పీఎస్‌బీలను 12 నుంచి 4కి తగ్గించే ప్రణాళికలు చేస్తుందా? SBI, PNB, Bank of Baroda, Canara–Union Bank విలీన వివరాలు, 2026–27లో పెద్ద మార్పులు. మంత్రి పంకజ్ ఛౌధ్రీ వివరణ.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరో భారీ మార్పు రాబోతుందా? దేశవ్యాప్తంగా ఈ ప్రశ్న చర్చకు వస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం Public Sector Banks (PSBs) సంఖ్యను ప్రస్తుత 12 నుంచి కేవలం 4కు తగ్గించే దిశగా ముందడుగు వేస్తోందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి.

ఈ మేగా విలీన ప్రక్రియ అమలైతే, భారత బ్యాంకింగ్ రంగం పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మిగిలేది కేవలం 4 పీఎస్‌బీలు?

విలీన ప్రణాళిక ప్రకారం, చివరకు కొనసాగేది ఈ నాలుగు పెద్ద బ్యాంకులేనని ప్రచారం:

  1. State Bank of India (SBI)
  2. Punjab National Bank (PNB)
  3. Bank of Baroda (BoB)
  4. Canara Bank–Union Bank కొత్త సంస్థ

మిగతా బ్యాంకులను ఇవి నాలుగింటిలోనే విలీనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

Canara Bank + Union Bank = భారీ బ్యాంక్?

ఈ విలీనంలో ప్రధాన మార్పు:

1.కెనరా బ్యాంక్ + యూనియన్ బ్యాంక్ విలీనం

2. వీటి కిందకే ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ చేరే అవకాశం

దీంతో ఒక సూపర్-లార్జ్ పీఎస్‌బీ అవతరించే అవకాశం ఉంది.

ఇతర బ్యాంకుల పరిస్థితి?

ఇవన్నీ ఇతర పెద్ద బ్యాంకులతో కలుపుతారన్న వార్తలు:

  1. Indian Overseas Bank (IOB)
  2. Central Bank of India
  3. Bank of India (BoI)
  4. Bank of Maharashtra

ఇవి SBI, PNB లేదా BoBలో విలీనం కావొచ్చని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి.

Punjab & Sind Bank విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.

విలీన ప్రక్రియ – ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది?

  1. బ్యాంకుల మధ్య విలీనం ప్రణాళిక సిద్ధం
  2. ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిణీ
  3. కేబినెట్ సెక్రటేరియట్ సమీక్ష
  4. ప్రధాని కార్యాలయం పరిశీలన
  5. మార్కెట్ రెగ్యులేటర్ SEBI ఆమోదం

అన్ని అనుమతులు లభిస్తే 2026–27లో రెండో విడత పీఎస్‌బీ మేగా విలీనం జరిగే అవకాశముందని వర్గాలు చెబుతున్నాయి.

మొదటి విడతలో ఏమైంది?

2017–2020 మధ్య ప్రభుత్వం పీఎస్‌బీలను 27 నుంచి 12కి తగ్గించింది. అదే ప్రక్రియను ఇప్పుడు రెండో విడతగా మరింత దూకుడుగా అమలు చేయబోతుందన్న రూమర్లు వినిపిస్తున్నాయి.

విలీన లక్ష్యాలు — ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?

  1. భారీ బ్యాలెన్స్ షీట్లు
  2. అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేయగల సామర్థ్యం
  3. కార్యకలాపాల సామర్థ్యం పెంపు
  4. చిన్న బ్యాంకులను పెద్దవాటిలో విలీనం చేసి రిస్క్ తగ్గించడం

నిపుణుల మాటలో:

“మొదట చిన్న బ్యాంకులు పెద్దవాటిలో విలీనం, ఆపై ఆ పెద్ద బ్యాంకుల్ని మళ్లీ ఐక్యం చేసి మరింత శక్తివంతమైన బ్యాంకింగ్ వ్యవస్థను రూపొందించాలన్న భావన కనిపిస్తోంది.”

"విలీన ప్రతిపాదనలు లేవు": కేంద్ర మంత్రి క్లారిఫికేషన్

పీఎస్‌బీల విలీనం పై వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ,

కేంద్ర సహాయ ఆర్థికమంత్రి పంకజ్ ఛౌధ్రీ ఇలా అన్నారు:

1."ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పీఎస్‌బీల విలీన ప్రతిపాదనలు లేవు."

2.పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో FDI పరిమితి 20%, ప్రైవేట్ బ్యాంకుల్లో 74% అని స్పష్టం చేశారు.

3. IDBI బ్యాంక్ వాటాల విక్రయం కేబినెట్ ఆమోదాలతోనే జరుగుతోందని తెలిపారు.

అయితే, ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ… బ్యాంకింగ్ రంగంలో పెద్ద మార్పులకు రంగం సిద్ధమవుతుందన్న అభిప్రాయం నిపుణులలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories