
Sherry Singh: 48వ మిసెస్ యూనివర్స్గా షెర్రీ సింగ్
Mrs Universe 2025: ఫిలిప్పీన్స్ మనీలాలో జరిగిన అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత పతాకం రెపరెపలాడింది.
Mrs Universe 2025: ఫిలిప్పీన్స్ మనీలాలో జరిగిన అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత పతాకం రెపరెపలాడింది. భారత్కు చెందిన షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ పోటీలో షేర్రీ 120 మందితో పోటీ పడి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
షెర్రీ సింగ్కి తొమ్మిది ఏళ్ల క్రితం వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె అంతర్జాతీయ అందాల పోటీల్లో విజేతగా నిలిచిన తర్వాత.. ఈ విజయం కేవలం నా ఒక్కదానిదే కాదని.. హద్దులు దాటి కలలు కనే ప్రతి మహిళదని తెలిపారు. బలం, దయ, పట్టుదల.. మహిళ నిజమైన అందానికి నిదర్శనమని.. నేను ప్రపంచానికి చూపించాలనుకున్నానని తెలిపారు. అమెను విజేతగా ప్రకటించిన తర్వాత ఆమె భారత జెండాను చేతబట్టి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. చరిత్రాత్మకమైన ఈ విజయం భారత్ను గర్వపడేలా చేసిందని.. మిసెస్ యూనివర్స్ పోటీ నిర్వాహకులు ప్రశంసించారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire