
Mahashivratri Fasting Rules 2026: మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా? ఏవి తింటే పుణ్యం.. ఏవి తింటే దోషం? పూర్తి వివరాలు ఇవే!
Mahashivratri Fasting Rules 2026: మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండటం అనేది కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, అది మనసును పరమశివునికి అంకితం చేసే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అని పలువురు ఆధ్యాత్మి వేత్తలు చెబుతున్నారు.
Mahashivratri Fasting Rules 2026: మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండటం అనేది కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, అది మనసును పరమశివునికి అంకితం చేసే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అని పలువురు ఆధ్యాత్మి వేత్తలు చెబుతున్నారు. ఈ స్పెషల్ స్టోరీలో ఉపవాస సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఉపవాసం ఉండేవారు ఏయే పదార్థాలు తీసుకోవాలో, అలాగే ఉపవాస నియమాలు ఏంటో తెలుసుకుందాం.
మహాశివరాత్రి ఉపవాస నియమాలు..
* ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించండి. తరువాత, ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి.
* శివలింగానికి నీరు, పాలు, బిల్వ పత్రం, ధాతుర, పండ్లు సమర్పించండి. ప్రశాంతమైన మనస్సుతో మంత్రాలను జపిస్తూ ధ్యానం చేయండి.
* కోపం, అబద్ధాలు, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి.
* ఎవరినీ అవమానించవద్దు.
* ఉపవాసం సమయంలో మనస్సు, శరీరం రెండింటి స్వచ్ఛత అవసరమని భావిస్తారు.
* మరుసటి రోజు, శుభ సమయంలో ఉపవాసం ముగించి, ముందుగా దేవునికి ఆహారం నైవేద్యం పెట్టండి.
ఉపవాసం టైంలో ఏమి తినాలి? ఏవి తినకూడదు..
ఉపవాసం చేసే వారు తమ శారీరక శక్తిని బట్టి మూడు రకాలుగా దీక్షను పాటించవచ్చు:
* రోజంతా నీరు కూడా తీసుకోకుండా ఉండటం (ఆరోగ్యం సహకరించే వారు మాత్రమే చేయాలి).
* పండ్లు, పాలు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం.
* పగలు ఉపవాసం ఉండి, రాత్రి పూజ తర్వాత సాత్విక ఆహారం తీసుకోవడం.
ఏమి తినవచ్చు? (ఉపవాసంలో అనుమతించినవి)
ఉపవాస సమయంలో నీరసం రాకుండా ఉండటానికి ఈ క్రింది సాత్విక ఆహారాలను తీసుకోవచ్చని శాస్త్రం చెబుతుంది:
* అరటిపండు, యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
* పాలు, పెరుగు, మజ్జిగ, పన్నీర్, నెయ్యి. శివునికి ప్రీతికరమైన పాలు మీ కడుపును నిండుగా ఉంచుతాయి.
* బాదం, జీడిపప్పు, వాల్నట్స్, ఖర్జూరం. ఇవి రోజంతా మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుతాయి.
* ద్రవ పదార్థాలు: కొబ్బరి నీళ్లు, నిమ్మరసం (ఉప్పు లేకుండా), మజ్జిగ, హెర్బల్ టీ. ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి.
* చాలా మంది సగ్గుబియ్యం కిచిడి లేదా ఉడికించిన బంగాళదుంపలను (కారం లేకుండా) తీసుకుంటారు.
వీటికి దూరంగా ఉండండి..
శివరాత్రి పర్వదినాన కొన్ని పదార్థాలను తీసుకోవడం శాస్త్రరీత్యా, ఆరోగ్యరీత్యా నిషిద్ధం. అవి ఏమిటంటే..
* బియ్యం, గోధుమలు, పప్పులు, మైదా, మొక్కజొన్న వంటి ధాన్యాలను అస్సలు తీసుకోకూడదు.
* ఇవి తామసిక గుణాన్ని పెంచుతాయి కాబట్టి ఉపవాస సమయంలో వీటికి దూరంగా ఉండాలి.
* ఐయోడైజ్డ్ సాల్ట్ కూడా వాడకూడదు.
* ఘాటైన మసాలాలు, ఎర్ర మిరపకాయలు, వేయించిన ఆహార పదార్థాలు కడుపులో మంటను కలిగిస్తాయి.
* మాంసాహారం, మద్యపానం పూర్తిగా నిషిద్ధం.
శాస్త్రోక్తంగా ఉపవాసం ఉండి, భక్తితో శివనామ స్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేసి, అందరూ క్షేమంగా శివయ్య అనుగ్రహం పొందేలా చేయండి. ఓం నమః శివాయ.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




