రేపే కార్తీక అమావాస్య — శుభ ముహూర్తం, పూజా విధానం, పితృ అనుగ్రహం పొందేందుకు జపించాల్సిన శక్తివంతమైన మంత్రం ఇదే!

రేపే కార్తీక అమావాస్య — శుభ ముహూర్తం, పూజా విధానం, పితృ అనుగ్రహం పొందేందుకు జపించాల్సిన శక్తివంతమైన మంత్రం ఇదే!
x
Highlights

కార్తీక అమావాస్య 2025 నవంబర్ 20 గురువారం. ఈ రోజు శుభ ముహూర్తం, పూజా విధానం, పితృదేవతల ఆశీర్వాదం కోసం జపించాల్సిన శక్తివంతమైన మంత్రం, తర్పణ విధానం—ఇక్కడ తెలుసుకోండి.

కార్తీక మాసంలో వచ్చే అమావాస్య అత్యంత శక్తివంతమైనది. ఈసారి కార్తీక అమావాస్య నవంబర్ 20 గురువారం వచ్చింది. పూర్వికులను స్మరించుకోవడానికి, పితృదేవతలను పూజించడానికి, దానధర్మాలు చేయడానికి ఇది అత్యుత్తమమైన రోజు. పితృదోషాలతో బాధపడుతున్నవారికి ఈ రోజు ప్రత్యేక పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

కార్తీక అమావాస్య శుభ ముహూర్తం — 2025

అమావాస్య తిథి ప్రారంభం: గురువారం ఉదయం 9:43 AM

తిథి ముగింపు: మధ్యాహ్నం 12:16 PM

బ్రహ్మముహూర్తం: తెల్లవారుజామున 4:00 AM – 5:54 AM

అమావాస్య రోజున బ్రహ్మముహూర్తంలో చేసిన పూజ, దానాలు, నది స్నానాలు అనేక రెట్లు పుణ్యఫలితాలను ఇస్తాయంటారు.

కార్తీక అమావాస్య పూజా విధానం — ఇలా చేసుకుంటే శుభఫలితాలు

1. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి.

2. వీలైతే నది స్నానం చేయడం ఉత్తమం.

3.రాగి పాత్రలో నీళ్లు, కొద్దిగా పాలు, సింధూరం, ఎర్ర పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి.

4.శివ–కేశవులను స్మరిస్తూ పుష్పాలు, పసుపు, కుంకుమ, చందనం, అక్షింతలు సమర్పించాలి.

5.నైవేద్యం పెట్టి దీపారాధన చేయాలి.

కార్తీక అమావాస్య నాడు తప్పక జపించాల్సిన శక్తివంతమైన మంత్రం

పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, పితృదోషాలను తగ్గించుకోవడానికి ఈ మంత్రం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు—

“ఓం పితృదేవతాయ నమః”

ఈ మంత్రాన్ని పవిత్రతతో, భక్తితో జపిస్తే పూర్వికుల ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

తర్పణాలు తప్పక చేయాలి

పూజ అనంతరం పితృదేవతలకు తర్పణం సమర్పించడం అత్యంత శ్రేయస్కరం.

సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయాలి.

వీలైతే పిండి దీపం వెలిగించడం చాలా శుభప్రదం.

ఇలా చేస్తే కుటుంబంలో శాంతి, సౌఖ్యం, పితృ అనుగ్రహం లభిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories