KCL 2025 : 18సిక్సర్లు, 181 పరుగులు.. విధ్వంసానికి మారుపేరు.. రికార్డులన్నీ తారుమారు


KCL 2025 : 18సిక్సర్లు, 181 పరుగులు.. విధ్వంసానికి మారుపేరు.. రికార్డులన్నీ తారుమారు
KCL 2025 : కేరళ క్రికెట్ లీగ్ 2025లో ప్రతిరోజూ విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన కనిపిస్తోంది. లీగ్లో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడు విష్ణు వినోద్ గురించి చెప్పాలంటే.. అతను కేవలం 2 మ్యాచ్లలోనే అందరినీ వెనక్కి నెట్టేశాడు.
KCL 2025 : కేరళ క్రికెట్ లీగ్ 2025లో ప్రతిరోజూ విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శన కనిపిస్తోంది. లీగ్లో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడు విష్ణు వినోద్ గురించి చెప్పాలంటే.. అతను కేవలం 2 మ్యాచ్లలోనే అందరినీ వెనక్కి నెట్టేశాడు. కేవలం రెండు రోజుల్లో రెండు మ్యాచ్లు ఆడిన అతను, మొత్తం 18 సిక్సర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఈ విధ్వంసక ఆటతీరుతో విష్ణు వినోద్ కేసీఎల్ 2025లో 3 రికార్డులను తన పేరు మీద నమోదు చేసుకున్నాడు.
విష్ణు వినోద్ కేవలం రెండు రోజుల్లోనే 2 మ్యాచ్లలో ఎలా పరుగులు, సిక్సర్ల వర్షం కురిపించాడనేది ఆశ్చర్యపరిచే విషయం. త్రిస్సూర్ టైటాన్స్పై అతను తన విధ్వంసక బ్యాటింగ్ చూపించాడు. ఆగస్టు 25న జరిగిన మ్యాచ్లో ఏరిస్ కొల్లామ్ సెయిలర్స్ బ్యాట్స్మెన్ విష్ణు వినోద్ ఓపెనర్గా వచ్చి కేవలం 38 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. 8 సిక్సర్లతో 226.32 స్ట్రైక్ రేట్తో అతను ఈ పరుగులు సాధించాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా, ఏరిస్ కొల్లామ్ సెయిలర్స్ త్రిస్సూర్ టైటాన్స్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. త్రిస్సూర్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసి 19.5 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. 145 పరుగుల లక్ష్యాన్ని ఏరిస్ కొల్లామ్ సెయిలర్స్ కేవలం 14.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.
దీనికి ముందు, ఆగస్టు 24న సంజూ శాంసన్ జట్టు కొచ్చి బ్లూ టైగర్స్పై కూడా విష్ణు వినోద్ మెరుపులు మెరిపించాడు. ఆ మ్యాచ్లో అతను 41 బంతుల్లో 10 సిక్సర్లతో 229.27 స్ట్రైక్ రేట్తో 94 పరుగులు చేశాడు. అయితే, సంజూ శాంసన్ సెంచరీ కారణంగా అతని జట్టు 236 పరుగులు చేసినప్పటికీ మ్యాచ్ గెలవలేకపోయింది.
రెండు రోజుల్లో రెండు మ్యాచ్లలో 18 సిక్సర్లు కొట్టి, విష్ణు వినోద్ కేసీఎల్ 2025లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో పాటు, అతను లీగ్ ప్రస్తుత సీజన్లో అత్యధికంగా 181 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ కూడా. అంతేకాకుండా, అత్యధిక అర్ధసెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో కూడా విష్ణు వినోద్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు అతను 2 హాఫ్ సెంచరీలు సాధించాడు.
విష్ణు వినోద్ కేసీఎల్ 2025లో సంజూ శాంసన్ తర్వాత రెండో అత్యంత ఖరీదైన ఆటగాడు. అతన్ని రూ. 13.8 లక్షలకు కొనుగోలు చేశారు. తన అద్భుతమైన ప్రదర్శనతో ఈ మొత్తానికి అతను పూర్తి న్యాయం చేస్తున్నాడు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire