Asia Cup 2025: భారత్పై ఫిర్యాదు చేసిన పాకిస్థాన్.. మ్యాచ్ గెలిచిన టీమిండియా ఆ పని ఎందుకు చేయలేదు?

Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా దాయాది పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించినప్పటికీ, మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా దాయాది పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించినప్పటికీ, మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. మ్యాచ్ ముగిశాక పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం (షేక్హ్యాండ్) చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించడం వివాదాస్పదమైంది. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మ్యాచ్ రిఫరీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది.
దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాక్పై గెలుపొందింది. అయితే, మ్యాచ్ తర్వాత సంప్రదాయం ప్రకారం షేక్హ్యాండ్ కోసం పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, కోచ్ మైక్ హెస్సన్తో పాటు ఆ జట్టు ఆటగాళ్లంతా మైదానంలో ఎదురుచూశారు. కానీ, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సహచరుడు శివమ్ దూబేతో కలిసి నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళిపోయారు. డ్రెస్సింగ్ రూమ్ తలుపులు మూసి ఉండటంతో పాక్ జట్టు నిరాశగా వెనుదిరిగింది.
ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పీసీబీ, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అయితే, ఈ నిర్ణయం పాకిస్థాన్ను ఉద్దేశించి తీసుకున్నది కాదని, ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది బాధితుల కుటుంబాలకు సంఘీభావంగానే ఇలా చేశామని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ విజయాన్ని బాధితుల కుటుంబాలకు, భారత సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాశ్మీర్ దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ ఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire