Athlete Bite Medal: అథ్లెట్లు పతకాన్ని ఎందుకు కొరుకుతారు.. అసలు విషయం ఏంటో తెలుసా?

Athlete Bite Medal: అథ్లెట్లు పతకాన్ని ఎందుకు కొరుకుతారు.. అసలు విషయం ఏంటో తెలుసా?
x
Highlights

Why Athletes Bite Medal: పారిస్ ఒలింపిక్స్ 2024 జులై 26న ప్రారంభమవుతుంది. ఈ గేమ్స్ ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి.

Why Athletes Bite Medal: పారిస్ ఒలింపిక్స్ 2024 జులై 26న ప్రారంభమవుతుంది. ఈ గేమ్స్ ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈసారి భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు. ఈసారి భారత్ ఖాతాలో ఎక్కువ పతకాలు వస్తాయని అంతా భావిస్తున్నారు. అయితే, పతకం గెలిచిన తర్వాత అథ్లెట్స్ కొరుకుతున్న ఫొటోలు మనకు దర్శనమిస్తుంటాయి.

ఒలింపిక్స్ అయినా, కామన్వెల్త్ అయినా, ఆసియా క్రీడలైనా... పోడియంపై నిలబడి పతకాలను కొరుకుతున్న అథ్లెట్ల ఫొటోలను అభిమానులు తరచూ చూస్తూనే ఉంటారు. ఏదైనా పెద్ద టోర్నీలో అథ్లెట్ పతకం గెలిచినప్పుడు, పోడియంపై నిలబడి దానిని ఎందుకు కొరుకుతాడు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఇది నియమమా లేక సంప్రదాయమా?

ఈ ప్రశ్న గురించి అభిమానులు ఎప్పుడూ గందరగోళానికి గురవుతారు. సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. కానీ, ఈ ప్రశ్నను దృష్టిలో ఉంచుకుని, చరిత్రకారుల మాటలపై దృష్టి సారించినప్పుడు, విషయం వేరేలే కనిపిస్తుంది.

చరిత్ర ప్రకారం, పురాతన కాలంలో విలువైన లోహాన్ని కరెన్సీగా ఉపయోగించారు. ఆ సమయంలో వ్యాపారులు బంగారు నాణేలను కత్తిరించి వాటి ప్రామాణికతను తనిఖీ చేసేవారు. ఎందుకంటే బంగారం మృదువైన లోహం, తక్కువ ఒత్తిడితో పగిలిపోతుందని తెలిసిందే.

స్వచ్ఛమైన బంగారు పతకాల ప్రదానం 1912 తర్వాత బంద్..

పతకాన్ని పళ్లతో కొరికేయడం అంటే దాని స్వచ్ఛతను పరీక్షించడం కాదు. 1912కి ముందు స్వచ్ఛమైన బంగారు పతకాలు ఇచ్చేవారు. అయితే, దీని తర్వాత అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) స్వచ్ఛమైన బంగారు పతకాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది. అయితే పతకాన్ని పళ్లతో కొరికినందుకే ఇలా చేశారని కాదు.

1912కి ముందు కూడా అథ్లెట్లు పతకాలను పళ్లతో కొరుక్కునేవారని కూడా చెబుతారు. అప్పుడు బంగారం స్వచ్ఛత కోసం చేసేవారు. కానీ, ఈ సంప్రదాయం 1912 తర్వాత కూడా కొనసాగుతోంది.

ఇది కాకుండా, అథ్లెట్లు తమ పతకాలను ఎందుకు కొరుకుతారో ఒలింపిక్ వెబ్‌సైట్‌లో కూడా సమాచారం ఇచ్చారు. ఒలింపిక్స్ ప్రకారం, అథ్లెట్లు ఫొటోల కోసం పతకాలను పళ్లతో కొరుకుతారంట. అథ్లెట్లు తమ పతకాలను పట్టుకుని పోడియంపై నిలబడితే, ఫొటోగ్రాఫర్లు తమ పతకాన్ని పళ్లతో కొరుకుతున్నట్లుగా పోజులు ఇవ్వమని అడుగుతారంట.

అథ్లెట్లు ఫొటోగ్రాఫర్ కోసం పోజులు..

ఫోటోగ్రాఫర్లు ఈ విషయంలో భిన్నమైన నమ్మకాలను కలిగి ఉన్నారు. ఎల్లప్పుడూ అథ్లెట్ నుంచి ఈ భంగిమను డిమాండ్ చేస్తుంటారంట. ఈ భంగిమ ఫోటోగ్రాఫర్‌కు గర్వకారణం, ఈ అద్భుతమైన పోజ్ మరుసటి రోజు వార్తాపత్రిక మొదటి పేజీలో ప్రచురించబడుతుందని వారు నమ్ముతుంటారు. ఫోటోగ్రాఫర్లు స్వయంగా ఈ భంగిమ కోసం అథ్లెట్లకు విజ్ఞప్తి చేయడానికి ఇదే కారణమంట.

ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఒలింపిక్ హిస్టోరియన్స్ (ISOH) మాజీ ప్రెసిడెంట్ డేవిడ్ వాలెచిన్స్కీ CNNతో మాట్లాడుతూ, 'ఇది ఫోటోగ్రాఫర్‌లకు తప్పనిసరిగా కావాల్సిన భంగిమగా మారింది. ఇది అథ్లెట్లు సొంతంగా చేయాల్సిన పని అని నేను అనుకోను' అంటూ చెప్పుకొచ్చాడు.

ఓ అథ్లెట్ పన్ను విరిగింది..

పతకాన్ని పళ్లతో కొరికే భంగిమ అథ్లెట్‌కే కాదు ఫోటోగ్రాఫర్‌కు కూడా ఆనవాయితీగా మారింది. అయితే, ఈ భంగిమలో ఓ అథ్లెట్ పంటి విరిగింది. ఈ సంఘటన 2010 వింటర్ ఒలింపిక్స్‌లోనిది. జర్మన్ లూగర్ డేవిడ్ ముల్లర్ రజత పతకాన్ని గెలుచుకున్న సమయంలో జరిగింది.

అప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ తన పళ్ళతో అదే పతకాన్ని కొరుకమని అడిగాడు. ఈ సమయంలో అతని దంతాలు విరిగిపోయాయి. ఈ విషయాన్ని స్వయంగా ముల్లర్ ఒక జర్మన్ వార్తాపత్రిక బిల్డ్‌తో చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories