Ravichandran Ashwin: “భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసింది” – అశ్విన్‌ వ్యాఖ్యలు వైరల్‌

Ravichandran Ashwin: “భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసింది” – అశ్విన్‌ వ్యాఖ్యలు వైరల్‌
x
Highlights

మహిళల క్రికెట్‌ వరల్డ్‌కప్‌ విజయం పై రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందించారు. “భారత మహిళల జట్టు, పురుషుల జట్టు చేయని పని చేసింది” అంటూ అశ్విన్‌ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

భారత మహిళల క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాపై (South Africa) 52 పరుగుల తేడాతో విజయం సాధించి వన్డే వరల్డ్‌కప్‌ 2025ను కైవసం చేసుకుంది. 2005, 2017లో ఫైనల్‌ దశలో ఓటమి ఎదుర్కొన్న భారత మహిళల జట్టు, ఈసారి ఘన విజయంతో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.

ఈ విజయంపై టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ప్రత్యేక వ్యాఖ్యలు చేశారు.

“పురుషుల జట్టు చేయలేదది మహిళల జట్టు చేసింది” – అశ్విన్

అశ్విన్‌ మాట్లాడుతూ,

“భారత మహిళల జట్టు వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత ట్రోఫీని మిథాలీ రాజ్‌ (Mithali Raj)కి అందించడం నిజంగా హృదయాన్ని తాకింది. భారత పురుషుల జట్టు ఇంతవరకు అలాంటి పని చేయలేదు. మీడియా ముందు మాటలు చెప్పడం ఒకటి, కానీ మునుపటి తరానికి గౌరవం ఇవ్వడం ఇంకో విషయం” అని అన్నారు.

“మా తరం బాగుంది, మీ తరం అంత గొప్ప కాదు అనే చర్చలు ఎక్కువగా జరుగుతాయి. కానీ మహిళల జట్టు చూపించింది గౌరవం అంటే ఏమిటో” అని అశ్విన్‌ స్పష్టం చేశారు.

“ఇది 25 ఏళ్ల కష్టానికి ఫలితం” – అశ్విన్‌ విశ్లేషణ

అశ్విన్‌ మాట్లాడుతూ,

“అంజుమ్‌ చోప్రా, మిథాలీ రాజ్‌లకు టీమ్‌ఇండియా ట్రోఫీ ఇవ్వడం అద్భుతమైన క్షణం. వారు భావోద్వేగానికి లోనయ్యారు. ఇది ఒక్కరోజు వచ్చిన విజయం కాదు, ఇది 25 ఏళ్ల కృషి ఫలితం. ఈ విజయంతో భారత మహిళల జట్టు కేవలం ట్రోఫీ గెలిచింది కాదు, కొత్త తరం యువతిలో క్రికెట్‌పై ప్రేరణను రేకెత్తించింది” అని అన్నారు.

మహిళా క్రికెట్‌కు ఇది మలుపు

అశ్విన్‌ అభిప్రాయం ప్రకారం, ఈ విజయం భారత మహిళా క్రికెట్‌ చరిత్రలోనే గొప్ప ఘట్టం. ఇది కేవలం క్రీడా విజయం మాత్రమే కాదు, భారత మహిళా క్రీడాకారిణుల ఆత్మవిశ్వాసానికి నూతన పునాది అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories