
Team India: టీమిండియా టెస్టులకు కొత్త కెప్టెన్ ? రోహిత్ శర్మ గురించి కీలక అప్ డేట్
Team India: ఇటీవల రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీం ఇండియా ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Team India: ఇటీవల రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీం ఇండియా ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత జట్టు జూన్లో మైదానంలోకి అడుగుపెడుతుంది. అది ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడేందుకు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే రోహిత్ శర్మ ఈ పర్యటనలో టీం ఇండియా తరఫున ఆడతాడా.. ఆ సమయంలో అతడు కెప్టెన్ గా వ్యవహరిస్తాడా లేదా ? అతని కెప్టెన్సీలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది కాబట్టి ఈ ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి. ఈ పర్యటన సందర్భంగా రోహిత్ టెస్ట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇటీల తన రిటైర్మెంట్ వార్తలను తిరస్కరించారు. ఇప్పుడు అతని కెప్టెన్సీ గురించి కూడా ఒక కీలక అప్ డేట్ వచ్చింది.
రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి పెద్ద అప్డేట్
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ కెరీర్లో ఒక పెద్ద మలుపు తిరిగింది. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. రోహిత్ శర్మ మరో పెద్ద పర్యటనకు జట్టును కెప్టెన్గా నియమించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి, దాని సెలక్షన్ ప్యానెల్ సపోర్ట్ దక్కించుకున్నాడు. దీని అర్థం ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ శర్మ కెప్టెన్గా కొనసాగే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం వల్ల రోహిత్ టెస్ట్ కెరీర్ కొనసాగుతుందని అర్థం అవుతుంది.
2024-25 ఆస్ట్రేలియా పర్యటనలో టీం ఇండియా 3-1 తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సమయంలో రోహిత్ ప్రదర్శన పై విమర్శలు వచ్చాయి. రోహిత్ సిరీస్ చివరి మ్యాచ్లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో ఈ సిరీస్ ముగిసిన వెంటనే అతను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడని అభిమానుల్లో పుకార్లు వ్యాపించడం ప్రారంభించాయి. కొంతమంది సీనియర్లు కూడా రోహిత్ టెస్ట్ ఫార్మాట్ను విడిచిపెట్టాలని భావించారు. కానీ రోహిత్ తన విమర్శకులకు తగిన సమాధానం ఇస్తూ ఒక పెద్ద ప్రకటన ఇచ్చాడు.
సిడ్నీ టెస్ట్ రెండో రోజు లంచ్ సమయంలో స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ రోహిత్ శర్మ మాట్లాడుతూ, 'ఇప్పుడు పరుగులు రావడం లేదు, కానీ 5 నెలల తర్వాత కూడా అవి రావని హామీ లేదు. నేను కష్టపడి పనిచేస్తాను. కానీ ఈ నిర్ణయం రిటైర్మెంట్ గురించి కాదు. బయట ల్యాప్టాప్, పెన్ను, కాగితం పట్టుకుని కూర్చున్న వ్యక్తులు రిటైర్మెంట్ ఎప్పుడు వస్తుందో, నేను ఏ నిర్ణయాలు తీసుకుంటారో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ సిరీస్లోని 3 మ్యాచ్లలో రోహిత్ 3, 6, 10, 2, 9 పరుగులు చేశాడు. అంటే భారత కెప్టెన్ 5 ఇన్నింగ్స్లలో 6.20 సగటుతో మొత్తం 31 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్లో బిసిసిఐ కొత్త కెప్టెన్తో వెళ్లవచ్చని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి అది జరిగేలా కనిపించడం లేదు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire