
Team India : గిల్, అయ్యర్ ఔట్.. టీమిండియా సెలెక్టర్లకు బిగ్ ఛాలెంజ్.. ODI సిరీస్కు కొత్త కెప్టెన్
గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు (నవంబర్ 23, ఆదివారం) ఆట ముగిసిన తర్వాత, భారత క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రకటన రానుంది.
Team India : గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు (నవంబర్ 23, ఆదివారం) ఆట ముగిసిన తర్వాత, భారత క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రకటన రానుంది. ఈ రోజు సౌతాఫ్రికా పర్యటనలో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ల కోసం టీమిండియా స్క్వాడ్ను సెలక్ట్ చేయనున్నారు. ఈ సెలెక్షన్ మీటింగ్లో అందరి దృష్టి ముఖ్యంగా వన్డే సిరీస్ కెప్టెన్ ఎంపికపైనే ఉంది. సౌతాఫ్రికా ఇప్పటికే రెండు సిరీస్లకు తమ స్క్వాడ్ను ప్రకటించింది.
భారత్, సౌతాఫ్రికా మధ్య నవంబర్ 30 నుంచి 3 వన్డేల సిరీస్, ఆ తర్వాత డిసెంబర్ 9 నుంచి 5 టీ20ల సిరీస్ జరగనుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సహా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మొత్తం గౌహతిలోనే ఉన్నారు. ఒకప్పుడు ఈ మీటింగ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే సిరీస్కు ఆడతారా లేదా అనే చర్చ జరిగేది. కానీ ఇప్పుడు, కొత్తగా ఎంపికైన కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ గాయం కారణంగా సిరీస్కు దూరం కావడం దాదాపు ఖాయం కావడంతో, కెప్టెన్సీ ఎంపికే పెద్ద సమస్యగా మారింది. వైస్-కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో, సెలెక్టర్ల ముందు అతి తక్కువ ఆప్షన్స్ మాత్రమే మిగిలాయి.
సెలెక్టర్ల ముందు ప్రస్తుతం మూడు ఆప్షన్లు ఉన్నాయి. అతి సులువైన ఆప్షన్ ఏమిటంటే కేవలం ఈ ఒక్క సిరీస్కు మాత్రమే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్గా నియమించడం. ఒకవేళ సెలెక్టర్లు తిరిగి పాత కెప్టెన్ వైపు వెళ్లకూడదనుకుంటే కేఎల్ రాహుల్ స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ గా కనిపిస్తున్నాడు. సెలెక్టర్లు భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నట్లయితే, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్కు అవకాశాలు దక్కవచ్చు. పంత్ గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ సిరీస్తో పంత్ వన్డేలకు తిరిగి రావడం మాత్రమే కాకుండా, మూడు మ్యాచ్ల్లోనూ ప్లేయింగ్ ఎలెవన్లో తన స్థానాన్ని పదిలం చేసుకునే అవకాశం ఉంది.
కెప్టెన్సీతో పాటు జట్టు కూర్పులోనూ కొన్ని మార్పులు తప్పనిసరి. శుభ్మన్ గిల్ లేకపోవడంతో, యువ సంచలనం యశస్వి జైస్వాల్కు రోహిత్ శర్మతో కలిసి వన్డే ఫార్మాట్లో ఓపెనింగ్ చేసే అవకాశం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వవచ్చు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు తన వివాహం కారణంగా సెలవు ఖరారైంది. వీరి స్థానంలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ బౌలింగ్ బాధ్యతలు స్వీకరించవచ్చు. ఆసియా కప్ నుంచి గాయంతో దాదాపు 2 నెలలుగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ గురించి ఈ రోజు తుది నిర్ణయం తీసుకుంటారు. టీ20 సిరీస్లో హార్దిక్ ఆడతాడా లేదా అనే విషయంపై క్లారిటీ వస్తుంది. ఒకవేళ గిల్ టీ20లకూ దూరమైతే, అక్కడ కూడా యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయవచ్చు, అలాగే సంజు శాంసన్కు టాప్ ఆర్డర్లో ఆడే ఛాన్స్ దక్కవచ్చు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




