విజయారెడ్డి ఆత్మహత్య కేసు: అసత్య ప్రచారంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం.. యూట్యూబ్ ఛానెళ్లపై పరువు నష్టం దావా!

విజయారెడ్డి ఆత్మహత్య కేసు: అసత్య ప్రచారంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం.. యూట్యూబ్ ఛానెళ్లపై పరువు నష్టం దావా!
x
Highlights

Hyderabad: చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Hyderabad: చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషాద సమయంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తన సోదరి మరణంపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని విజయారెడ్డి సోదరుడు చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అసత్య ప్రచారాలపై పోలీసులకు ఫిర్యాదు: శనివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న చిరంజీవి, తన సోదరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఛానెళ్లపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "విజయారెడ్డి, పిల్లలు చేతనరెడ్డి, విశాల్‌రెడ్డి మృతితో మా కుటుంబం కుంగిపోయింది. ఆఫీస్ వర్క్ ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆమె మరణం వెనుక ఇప్పటివరకూ మాకు ఎటువంటి అనుమానాలు లేవు. కానీ, కొన్ని ఛానెళ్లు ఇష్టమొచ్చినట్లు కథనాలు అల్లుతున్నాయి. వారిపై హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తాం" అని హెచ్చరించారు.

మరోవైపు, విజయారెడ్డి కేవలం డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలను పోలీసులు ప్రాథమికంగా ఖండించారు. ముగ్గురి ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు స్పష్టం చేశారు.

కేసు దర్యాప్తు దశలో ఉన్నందున, అన్ని కోణాల్లో ఆధారాలు సేకరించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని మేడిపల్లి పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories