Revanth Reddy: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Revanth Reddy: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
x

Revanth Reddy: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 

Highlights

Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.

Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌కు ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోడీకి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌-బెంగళూరు-చెన్నై బుల్లెట్‌ రైలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌ మెట్రో రైలు రెండోదశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు.

హస్తిన పర్యటనలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్​లాల్​ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆహ్వానించారు.

అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీలను మర్యాదపూర్వకంగా కలిసి..తెలంగాణ రైజింగ్​ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories