Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్: మేడారం అమ్మవార్ల దర్శనం.. ఆ వెంటనే దావోస్, అమెరికా పర్యటనలు!

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే రెండు వారాల పాటు అత్యంత బిజీ షెడ్యూల్ను ఖరారు చేసుకున్నారు.
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే రెండు వారాల పాటు అత్యంత బిజీ షెడ్యూల్ను ఖరారు చేసుకున్నారు. ఆధ్యాత్మిక పర్యటనతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన విదేశీ పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ నెల 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు సాగనున్న ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
18, 19 తేదీల్లో మేడారం పర్యటన
ముందుగా ముఖ్యమంత్రి ఈ నెల 18వ తేదీన ములుగు జిల్లాలోని మేడారంలో పర్యటిస్తారు. అక్కడ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం 19వ తేదీన ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.
పెట్టుబడుల వేటలో విదేశీ పర్యటన
అమ్మవార్ల దర్శనం ముగించుకున్న వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్పై దృష్టి సారించనున్నారు.
దావోస్ పర్యటన (జనవరి 19 - 23): 19వ తేదీ సాయంత్రమే సీఎం హైదరాబాద్ నుంచి స్విట్జర్లాండ్లోని దావోస్కు బయలుదేరుతారు. అక్కడ జరిగే 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం' (WEF) సదస్సులో పాల్గొంటారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ అయి తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానిస్తారు.
అమెరికా పర్యటన (జనవరి 24 - 31): దావోస్ పర్యటన ముగిసిన వెంటనే, 24వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడ వారం రోజుల పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలతో సమావేశమవుతారు.
ఫిబ్రవరి 1న తిరుగు ప్రయాణం
సుదీర్ఘ విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి ఫిబ్రవరి 1వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ఈ పర్యటనలు సాగనున్నాయని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



