Former Maoist Chief Devji : ఐటీ ఉద్యోగులతో కలవాలని మాజీ మావోయిస్ట్ దేవ్ జీ వ్యాఖ్యలు

Former Maoist Chief Dev Ji : ఐటీ ఉద్యోగులతో కలవాలని మాజీ మావోయిస్ట్ దేవ్ జీ వ్యాఖ్యలు
x

Former Maoist Chief Dev Ji : ఐటీ ఉద్యోగులతో కలవాలని మాజీ మావోయిస్ట్ దేవ్ జీ వ్యాఖ్యలు

Highlights

Former Maoist Chief Devji : లొంగిపోయిన మాజీ మావోయిస్ట్ చీఫ్ దేవ్ జీ హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగులతో మాట్లాడాలని ఆసక్తి వ్యక్తం చేశారు. కేంద్ర సంస్థల విచారణ కొనసాగుతోంది.

Former Maoist Chief Devji: మావోయిస్టుల లొంగుబాట్ల నేపథ్యంలో తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల కదలికలు పెరిగాయి. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ మావోయిస్ట్ చీఫ్ దేవ్ జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హైటెక్ సిటీకి వెళ్లి అక్కడ పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులతో మాట్లాడాలని తనకు ఆసక్తి ఉందని ఆయన తెలిపినట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా పలువురు టాప్ మావోయిస్టులు ఆయుధాలు విడిచి లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)తో పాటు ఇతర కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థల అధికారులు హైదరాబాద్‌కు చేరుకుని విచారణ ప్రారంభించారు. లొంగిపోయిన కీలక నేతల నుంచి కీలక సమాచారం రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల లొంగిపోయిన దేవ్ జీతో పాటు మల్లారాజిరెడ్డి, దామోదర్‌లను కూడా ప్రత్యేకంగా విచారించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆచూకీపై కేంద్ర సంస్థలు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గణపతి కదలికలు, భద్రతా వ్యవస్థ, ఆర్థిక లావాదేవీలు, పార్టీ భవిష్యత్ వ్యూహాలు వంటి అంశాలపై లోతైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి

లొంగిపోయిన అనంతరం దేవ్ జీ తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఏళ్ల తరబడి అండర్‌గ్రౌండ్ జీవితాన్ని గడిపిన ఆయన కుటుంబ సభ్యులతో భావోద్వేగంగా మమేకమైనట్లు సమాచారం. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉందని తన సమీప వర్గాలకు తెలిపినట్లు తెలుస్తోంది. ప్రజాసేవ దిశగా అడుగులు వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఐటీ ఉద్యోగులతో చర్చించాలనే వ్యాఖ్యలపై చర్చ

ఇక హైటెక్ సిటీలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులతో మాట్లాడాలని దేవ్ జీ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. సమాజంలోని కొత్త తరపు ఆలోచనలు, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కోరిక వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది భవిష్యత్ రాజకీయ వ్యూహానికి సంకేతమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

మరోవైపు దామోదర్ కూడా రాజకీయ రంగప్రవేశంపై సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ములుగు ప్రాంత ప్రజలు కోరుతున్నారని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ కేంద్ర బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories