Hyderabad Govt Plot Auction 2026: 137 ప్రభుత్వ ప్లాట్ల వేలానికి నోటిఫికేషన్! ఫిబ్రవరి 7, 8 తేదీల్లో వేలం.


హైదరాబాద్ సమీపంలోని 137 ప్రభుత్వ ఓపెన్ ప్లాట్ల వేలానికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సిద్ధమైంది. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరిగే ఈ వేలంలో పాల్గొనే వారు రూ. 2 లక్షల EMD చెల్లించాల్సి ఉంటుంది.
భాగ్యనగర పరిసరాల్లో ప్లాట్ కొనుగోలు చేయాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ (TGRSCL) ఆధ్వర్యంలో తొర్రూర్, బహదూర్పల్లి, కుర్మల్గూడ ప్రాంతాల్లోని 137 ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం వేయనున్నారు. ప్రభుత్వ వెంచర్లు కావడంతో ఎలాంటి వివాదాలు లేని 'క్లియర్ టైటిల్' భూములు లభిస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది.
వేలం ఎప్పుడు? ఎక్కడ?
తేదీలు: ఫిబ్రవరి 7 మరియు 8, 2026.
వేదిక: అవికా కన్వెన్షన్ (తారా కన్వెన్షన్ పక్కన), ORR ఎగ్జిట్ నెం. 11, పెద్ద అంబర్పేట్.
రిజిస్ట్రేషన్ ఫీజు (EMD): ఆసక్తి ఉన్నవారు రూ. 2,00,000 డిపాజిట్ (Earnest Money Deposit) చెల్లించాల్సి ఉంటుంది. ఇది రీఫండబుల్ అమౌంట్.
ఏ ఏరియాలో ఎన్ని ప్లాట్లు?
EMD చెల్లింపు విధానం:
ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు మీ సేవ (Meena Seva) కేంద్రాల ద్వారా లేదా హైదరాబాద్లో చెల్లించదగిన 'మేనేజింగ్ డైరెక్టర్, TGRSCL' పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీయడం ద్వారా డిపాజిట్ చెల్లించవచ్చు. వేలం జరిగే రోజున మీ సేవ రసీదు లేదా డీడీని వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
ఎందుకు కొనుగోలు చేయాలి?
ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాజీవ్ స్వగృహ ద్వారా వేలం వేస్తుండటంతో ఈ ప్లాట్లు 100 శాతం భారం లేనివి (Zero Incumbrance). అక్రమ లేఅవుట్లు, కబ్జాల భయం లేకుండా మధ్యతరగతి ప్రజలు ధైర్యంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ ప్లాట్లు అన్నీ అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్కు అత్యంత సమీపంలో ఉన్నాయి.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు రాజీవ్ స్వగృహ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



