
Govt Scheme: మహిళా సంఘాలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్.. మరో సరికొత్త స్కీమ్ తో 70శాతం సబ్సిడీ..!!
Indira Dairy Project Telangana: మహిళా సంఘాలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పథకాన్ని ప్రారంభించింది. మహిళా సంఘాల సభ్యుల కోసం ఇందిరా డెయిరీ ప్రాజెక్టు ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, స్థిరమైన ఆదాయ వనరులు అందించడమే ప్రభుత్వ ఉద్దేశ్యంగా పేర్కొంది.
ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ప్రారంభించారు. మొదటి దశలో మంచి స్పందన రావడంతో, త్వరలోనే కొడంగల్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రామీణ మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఈ పథకానికి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పథకం కింద అర్హులైన మహిళా సంఘ సభ్యులకు ఒక్కొక్కరికి రెండు పాడి గేదెలు లేదా ఆవులు అందించనున్నారు. ఒక్కో యూనిట్ మొత్తం విలువ రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వం రూ.1.40 లక్షలను సబ్సిడీగా అందించనుంది. మిగిలిన రూ.60 వేల మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా కల్పిస్తారు. దీంతో మహిళలపై ఆర్థిక భారం తక్కువగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
పాడి పరిశ్రమ ద్వారా రోజువారీ ఆదాయం లభించడంతో పాటు, పాలు, పాల ఉత్పత్తుల విక్రయం ద్వారా మహిళలు స్వయం ఆధారంగా నిలబడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. మహిళా సంఘాలను కేంద్రంగా చేసుకుని అమలు చేస్తున్న ఈ పథకం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని మహిళలకు లబ్ధి చేకూర్చేలా ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




