Hyderabad: చందానగర్ యువకుడి మృతి కేసులో కీలక మలుపు

Man Dies After Jumping from Hotel in Hyderabad
x

Hyderabad: చందానగర్ యువకుడి మృతి కేసులో కీలక మలుపు

Highlights

Hyderabad: హైదరాబాద్ చందానగర్ యువకుడి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. యువకుడే బిల్డింగ్ కిటికీలో నుంచి పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.

Hyderabad: హైదరాబాద్ చందానగర్ యువకుడి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. యువకుడే బిల్డింగ్ కిటికీలో నుంచి పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. కుక్కతో ఆడుకుంటూ... హోటల్ కిటికిలో నుంచి ఉదయ్ అనే యువకుడు పడిపోయాడు. ఈ ఘటన చందానగర్‌లోని వీవీ హోటల్‌లో జరిగింది. స్నేహితుడి బర్త్ డే పార్టీని హోటల్‌లో చేసుకున్న ఉదయ్... మధ్యలో బయటకు వెళ్లాడు.

అక్కడే ఉన్న కుక్కతో ఆడుకుండూ... అదుపు తప్పి మూడో అంతస్తు నుంచి పడిపోయాడు ఉదయ్. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం రాత్రి వరకు బయటకు తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు... కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories