పెళ్లి పేరుతో నమ్మించి.. బంగారం, నగదుతో ఉడాయించిన కిలాడీ లేడీ!

పెళ్లి పేరుతో నమ్మించి.. బంగారం, నగదుతో ఉడాయించిన కిలాడీ లేడీ!
x
Highlights

పెళ్లయిన యువతి మరో యువకుడిని మోసం చేసి పెళ్లి చేసుకుని బంగారంతో పారిపోయిన ఘటన కలకలం రేపుతుంది.

పెళ్లయిన యువతి మరో యువకుడిని మోసం చేసి పెళ్లి చేసుకుని బంగారంతో పారిపోయిన ఘటన కలకలం రేపుతుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి చెందిన ఓ యువకుడికి మ్యాట్రిమోనీ సైట్​ ద్వారా విజయవాడకు చెందిన యువతి పరిచయం అయింది. అనంతరం వారు వివాహం చేసుకున్నారు. అయితే వారం క్రితం ఆ యువతి ఇంట్లోని బంగారం, నగదు తీసుకుని పరారయింది. దీంతో బాధితుడు యువతి తల్లిదండ్రులను సంప్రదించే ప్రయత్నం చేయగా.. వారంతా ఫేక్​ అని తెలిసింది. తమను మోసం చేసిన యువతిపై పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.

Show Full Article
Print Article
Next Story
More Stories