
Medaram: మేడారం మహాజాతర తేదీలు ఖరారు..!
Medaram Jathara 2025: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది.
Medaram Jathara 2025: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ పుణ్యకార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు వైభవంగా జరగనుంది.
జాతర ముఖ్యమైన తేదీలు ఇలా
జనవరి 28: సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు దేవతలను గద్దెలపై ప్రతిష్టిస్తారు.
జనవరి 29: సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెకు చేరుకుంటుంది.
జనవరి 30: భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు.
జనవరి 31: అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు.
పూజారుల సంఘం ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. మేడారం జాతరను పురస్కరించుకుని లక్షలాది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివచ్చే అవకాశం ఉంది.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire