గజ్వేల్‌లోనూ కాంగ్రెస్ జయకేతనం.. కేసీఆర్‌లో గుబులు మొదలైంది: మంత్రి గడ్డం వివేక్

గజ్వేల్‌లోనూ కాంగ్రెస్ జయకేతనం.. కేసీఆర్‌లో గుబులు మొదలైంది: మంత్రి గడ్డం వివేక్
x
Highlights

Gaddam Vivek Slams KCR: రాష్ట్రంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పునాదులను కదిలించాయని, కాంగ్రెస్ సాధించిన భారీ విజయాలతో మాజీ సీఎం కేసీఆర్‌కు భయం మొదలైందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వ్యాఖ్యానించారు.

Minister Gaddam Vivek Slams KCR: రాష్ట్రంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పునాదులను కదిలించాయని, కాంగ్రెస్ సాధించిన భారీ విజయాలతో మాజీ సీఎం కేసీఆర్‌కు భయం మొదలైందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వ్యాఖ్యానించారు. గజ్వేల్ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ల సన్మాన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో కూడా పట్టు కోల్పోయారని ఎద్దేవా చేశారు. "రెండేళ్లపాటు ప్రజలను వదిలేసి ఫాంహౌస్‌కే పరిమితమైన వ్యక్తి, ఇప్పుడు బయటకు వచ్చి విమర్శలు చేయడం హాస్యాస్పదం" అని దుయ్యబట్టారు. గజ్వేల్ గడ్డపై కాంగ్రెస్ జయకేతనం ఎగురవేయడం కేసీఆర్ పతనానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో దూసుకుపోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లోనూ తాము విజయం సాధించామని గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు.

గ్రామస్థాయిలో అభివృద్ధిని పరుగులు తీయించే బాధ్యత కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లదేనని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నేతలు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories