Ponnam Prabhakar: సింగరేణిపై బీఆర్‌ఎస్ విష ప్రచారం.. ఆనాడు కాంట్రాక్టులు పొందిన వారు ఇప్పుడెలా చెడ్డవారయ్యారు?

Ponnam Prabhakar: సింగరేణిపై బీఆర్‌ఎస్ విష ప్రచారం.. ఆనాడు కాంట్రాక్టులు పొందిన వారు ఇప్పుడెలా చెడ్డవారయ్యారు?
x
Highlights

Ponnam Prabhakar: సింగరేణి కాలరీస్ సంస్థ విషయంలో బీఆర్‌ఎస్ నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు.

Ponnam Prabhakar: సింగరేణి కాలరీస్ సంస్థ విషయంలో బీఆర్‌ఎస్ నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే విపక్షం నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు.

అధిక ధరలకే టెండర్లు: బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో సింగరేణిలో భారీగా అక్రమాలు జరిగాయని పొన్నం ఆరోపించారు. గత ప్రభుత్వం ఏకంగా 30 శాతం అధిక కేటాయింపులతో కాంట్రాక్టులు మరియు టెండర్లను అప్పగించిందని ఆయన విమర్శించారు. అప్పట్లో కాంట్రాక్టులు పొందిన సంస్థలు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో చెడ్డవి ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు.

పార్టీలోనే సమన్వయ లోపం: బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి ఆ పార్టీ నేత కవిత స్వయంగా మాట్లాడారని, కానీ ఆమె లేవనెత్తిన ప్రశ్నలకు ఇప్పటివరకు ఆ పార్టీ నేతలు సరైన సమాధానం ఇవ్వలేకపోయారని మంత్రి ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ నుంచి పారిపోయారు: గతంలో హిల్ట్ (Hilt) పాలసీలపై ఇలాగే ఆరోపణలు చేశారని, కానీ వాటిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమవ్వగా సమాధానం చెప్పలేక బీఆర్‌ఎస్ నేతలు సభను బహిష్కరించి వెళ్లిపోయారని పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. గొంతు చించుకుని అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని, ప్రతిపక్షం తన వైఖరి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories