మంగపేట మండలంలో నో ఎలక్షన్: 14 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు రద్దు

మంగపేట మండలంలో నో ఎలక్షన్: 14 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు రద్దు
x

మంగపేట మండలంలో నో ఎలక్షన్: 14 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు రద్దు

Highlights

స్థానిక ఎన్నికలకు మంగపేట మండలం దూరం తేలని గిరిజనుల,గిరిజనేతరుల రిజర్వేషన్ల పంచాయితీ కోర్టు కేసుతో ఎన్నికలు నిర్వహించడం లేదన్న ఈసీ 14ఏళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలోనే మండలం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడితో పల్లెలు కళకళలాడుతున్నాయి. నామినేషన్ల పర్వం సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కానీ ఓ మండలం లోకల్ బాడీ ఎలక్షన్‌కు దూరమైంది. మంగపేట మండలంలో గిరిజనులు, గిరిజనేతరుల పంచాయితీ ఏంటి..? 14ఏళ్లుగా లోకల్ బాడీ ఎలక్షన్స్‌ లేకపోవడానికి కారణం ఏంటి..?

ములుగు జిల్లా మంగపేట మండలం ఈ సారి కూడా ఎన్నికలకు దూరమైంది. ఆ మండల ప్రజలు 14 ఏళ్లు ఓటుకు దూరంగా ఉన్నారు.గిరిజన, గిరిజనేతరుల రిజర్వేషన్ల వివాదం కోర్టులో ఉండడంతో ఈ సారి కూడా ఎన్నికలు నిర్వహించడం లేదు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌లో మంగపేట ఎన్నికలకు ఎస్ఈసీ మినహాయింపు ఇచ్చింది. కోర్టులో కేసు నడుస్తున్నందున ఎన్నికలు నిర్వహించడం లేదని స్పష్టం చేసింది.


వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దులో గోదావరి నది ఒడ్డున ఉన్న మంగపేట మండలంలో 25 గ్రామపంచాయతీలు, 14 ఎంపీటీసీ 230 పంచాయితీ వార్డులు ఉన్నాయి.39,369 మంది ఓటర్లు ఉన్న ఈ మండలం ములుగు జిల్లాలోని అతిపెద్ద మండలం. పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం 230 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు ఎన్నికలకు సన్నాహాలు చేశారు. మండలంలోని గ్రామపంచాయతీలను ఎంపీటీసీలను షెడ్యూల్ కులాలకు రిజర్వు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గిరిజనేతరులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


గిరిజన గిరిజనేతరుల మధ్య రిజర్వేషన్ల వివాదం నెలకొనడంతో గత 14 సంవత్సరాలుగా ఆ మండలంలో పంచాయతీ ఎన్నికలు జరగలేదు. 2011 నుండి మంగపేట మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు.2014లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పటికీ కోర్టు వివాదం కారణంగా గెలిచిన ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. తిరిగి 2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంగపేట మండలంలో కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి ఏర్పాట్లు చేశారు. తెల్లవారితే ఎన్నికలు జరగాల్సి ఉండగా ముందు రోజే న్యాయస్థానం నుండి ఆదేశాలు రావడంతో అప్పుడు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో 14 సంవత్సరాలుగా మంగపేట మండలంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు లేకుండానే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.


ఈసారైనా ఎన్నికలు జరుగుతాయని మండల ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. అధికార యంత్రాంగం ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ వార్డుల విభజన పూర్తి చేసింది. మండలం వారిగా పోలింగ్ స్టేషన్లను ఖరారు చేసింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఏర్పాట్లను నిలిపివేసింది. సోమవారం జారీ అయిన ఎన్నికల నోటిఫికేషన్లు కోర్టు వివాదంతో మంగపేట మండలాన్ని మినహాయింపు ఇచ్చింది. మరోసారి పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు మంగపేట మండలం నోచుకోకుండా పోయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories