Phone Tapping Case: కేటీఆర్ వ్యాఖ్యలు సరికావు.. సిట్ పిలిస్తే నేనూ వెళ్తా! - కవిత సంచలన వ్యాఖ్యలు

Phone Tapping Case: కేటీఆర్ వ్యాఖ్యలు సరికావు.. సిట్ పిలిస్తే నేనూ వెళ్తా! - కవిత సంచలన వ్యాఖ్యలు
x
Highlights

Phone Tapping Case: తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ (SIT) అధికారులు విచారించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు.

Phone Tapping Case: తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ (SIT) అధికారులు విచారించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె తన సోదరుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టడమే కాకుండా, తనపై కూడా నిఘా ఉందన్న అనుమానాలను వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

విచారణ త్వరగా ముగించాలి:

"సిట్ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్ గారే స్వయంగా వెల్లడిస్తారని నేను భావిస్తున్నాను. ఈ కేసు మొదలై రెండేళ్లు గడుస్తున్నా ఇంకా ఓ ముగింపునకు రాకపోవడం బాధాకరం. విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఈ అక్రమాలకు పాల్పడిన అసలైన దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలి" అని కవిత డిమాండ్ చేశారు.

కేటీఆర్ తీరుపై అసహనం:

ఇదే సమయంలో సిట్ విచారణను తప్పుబడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. "సిట్ విచారణను తప్పుబడుతూ కేటీఆర్ మాట్లాడటం సరికాదు. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తున్నప్పుడు సహకరించాలి. ఒకవేళ విచారణ కోసం సిట్ నన్ను పిలిచినా వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని స్పష్టం చేశారు.

నా ఫోన్లు కూడా ట్యాప్ చేశారు:

ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో తాను కూడా ఉన్నానని కవిత ఆరోపించారు. "నా ఫోన్ మాత్రమే కాదు, నా భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారని నాకు బలమైన అనుమానాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నిజానిజాలు బయటకు రావాలి" అని ఆమె పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories