
Narendra Modi: ఈనెల 30న మహబూబ్నగర్కు ప్రధాని నరేంద్ర మోడీ
Narendra Modi: త్వరలోనే అమిత్ షా, నడ్డా సభలకూ బీజేపీ ప్లాన్
Narendra Modi: త్వరలోనే తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. ఈనెల 30న మహబూబ్నగర్లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సభ ద్వారా ప్రధాని మోడీ తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీజేపీ దూకుడు పెంచుతోంది. ఎన్నికల షెడ్యూల్ కూడా త్వరలోనే వచ్చే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. దీంతో మరింత స్పీడ్ పెంచి పర్యటనలు ముమ్మరం చేసే ప్లాన్ చేస్తోంది టీబీజేపీ. ఈనెల 30న ప్రధాని పర్యటనతో ఎన్నికల శంఖారావం పూరించనుండగా.. అక్టోబర్ నుండి జాతీయ నేతలు కూడా పర్యటనకు రానున్నారు. ప్రధాని సభ అనంతరం బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలకు ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ బీజేపీ.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire