MCRHRDI: MCRHRDI వైస్ ఛైర్ పర్సన్ గా శాంతికుమారి నియామకం

Dhivi
Published on: 29 April 2025 7:24 AM IST
MCRHRDI: MCRHRDI వైస్ ఛైర్ పర్సన్ గా శాంతికుమారి నియామకం
X

MCRHRDI: మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివ్రుద్ధి సంస్థ వైస్ చైర్ పర్సన్ గా ఎ. శాంతికుమారి నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్న శాంతికుమారి..ఈనెల 30న రిటైర్మెంట్ చేయనున్నారు. రిటైర్మెంట్ అనంతరం ఎంసీఆర్ హెచ్ఆర్ డిఐ వైస్ చైర్ పర్సన్ గా శాంతికుమారి బాధ్యతలను స్వీకరిస్తారు. ఆమెకు ఇదే సంస్థకు డైరెక్టర్ జనరల్ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు సోమవారం వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు.

Dhivi

Dhivi

Next Story