Telangana: రాష్ట్రంలో మొదలైన స్టానిక ఎన్నికల జోరు.. సర్పంచ్, MPTC ఎన్నికల్లో ఏవి ముందు..?

Telangana Cabinet Approves BC Reservations for Sarpanch and MPTC Elections
x

Telangana: రాష్ట్రంలో మొదలైన స్టానిక ఎన్నికల జోరు.. సర్పంచ్, MPTC ఎన్నికల్లో ఏవి ముందు..?

Highlights

Telangana: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జోరు అందుకున్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

Telangana: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జోరు అందుకున్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. తాజాగా బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ జారీకి నిర్ణయించడంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం ఈజీ అయింది. ఇక ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా? లేక ఎంపీటీసీ, జెడ్ పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా? అని ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన సమావేశంలో క్యాబినేట్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కొత్త పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయితీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు, అలాగే మండల మరిషత్‌లలో ఎంపీటీసీ స్థానాలకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

తాజాగా క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభిస్తుంది. అయితే గతంలో బీజీలకు 34శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక ఈ పెంపుతో బీసీల్లో జోరు అందుకుంది. పలువురు నాయకులు కూడా హర్షం వ్యక్తం చేసారు.

త్వరలో రాష్ట్రంలో పంచాయితీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం ఇప్పటినుంచే మంత్రి వర్గం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే బీసీలు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియకు దారి ఈజీ అయింది. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ ఆధారంగా త్వరలో పంచాయితీ రాజ్ శాఖ రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీ చేయనుంది. దీని తర్వాతే పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరుగుతాయి.

ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇక సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు, పోలింగ్ కేంద్రాలను కూడా ఎంపిక చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,777 గ్రామ పంచాయతీలు, 5,982 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, 585 జెడ్సీటీసీ స్థానాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏం నిర్ణయించింది అంటే ముందుగా జెడ్‌పిటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలను చూస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories