ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం
x

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం

Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, నూతన విధానాలపై సూచనలు అందించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, నూతన విధానాలపై సూచనలు అందించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. గత నెల 28న ఈ జీవో జారీ చేయగా, తాజాగా ఈ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.

కమిటీ సభ్యులు:

ఛైర్మన్: సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్).

సభ్యులు:

ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ కంచ ఐలయ్య.

ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు.

ఉన్నత విద్యా మండలి ఛైర్మన్.

ఉన్నత విద్యా సంస్థల నుంచి ముగ్గురు ప్రతినిధులు.

కమిటీ బాధ్యతలు:

ఈ కమిటీ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పాలసీపై అధ్యయనం చేసి, ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించడం. విద్యా సంస్థలు చేసిన సూచనలు మరియు డిమాండ్‌లపై అధ్యయనం చేయడం. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం, ఈ కమిటీ తన నివేదికను మూడు నెలల్లోగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories