Telangana New Ration Cards: అర్హులకు అన్యాయం జరగదు.. కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన..!

Telangana Ration Card Update: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న సామాన్యులకు రేవంత్ సర్కార్ ఊరటనిస్తోంది.
Telangana Ration Card Update: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న సామాన్యులకు రేవంత్ సర్కార్ ఊరటనిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై పౌరసరఫరాల శాఖ తాజాగా కీలక గణాంకాలను విడుదల చేసింది. గడిచిన ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో 14.40 లక్షల కొత్త కార్డులను మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2025 జనవరిలో 89.95 లక్షలుగా ఉన్న రేషన్ కార్డుల సంఖ్య, 2026 జనవరి నాటికి 1,04,35,848కు చేరింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3,35,96,875కు పెరిగింది. అంటే రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం మందికి ప్రస్తుతం నెలకు 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం అందుతోంది.
కార్డుల విభజన ఇలా:
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు (NFSC): 56,57,001 (1.91 కోట్ల మంది లబ్ధిదారులు)
స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు (SFSC): 47,78,848 (1.44 కోట్ల మంది లబ్ధిదారులు)
కేవలం 2026 జనవరి నెలలోనే ప్రభుత్వం కొత్తగా 46,153 కార్డులను మంజూరు చేయడం గమనార్హం.
నిరంతరాయంగా దరఖాస్తుల స్వీకరణ: కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఆగిపోలేదని, ఇది నిరంతరాయంగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
కొత్త దరఖాస్తులు: కార్డులు రాని వారు ఇప్పటికీ మీ సేవ (Meeseva) కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పేర్ల నమోదు: పాత కార్డులలో పిల్లల పేర్లు లేదా కొత్తగా పెళ్లయిన వారి పేర్లను చేర్చే (Inclusion) ప్రక్రియ కూడా నిరంతరాయంగా సాగుతోంది.
సంక్షేమ పథకాలకు రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో, అర్హులందరికీ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



