Kishan Reddy: హైదరాబాద్‌ కేవలం రాష్ట్ర రాజధానే కాదు.. దేశంలో కీలకమైన ఆర్థిక నగరం

Kishan Reddy: హైదరాబాద్‌ కేవలం రాష్ట్ర రాజధానే కాదు.. దేశంలో కీలకమైన ఆర్థిక నగరం
x

Kishan Reddy: హైదరాబాద్‌ కేవలం రాష్ట్ర రాజధానే కాదు.. దేశంలో కీలకమైన ఆర్థిక నగరం

Highlights

Kishan Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో పాల్గొన్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, అతిథులందరికీ స్వాగతం పలికారు.

Kishan Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో పాల్గొన్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, అతిథులందరికీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత కీలకమైన ఆర్థిక నగరంగా అభివర్ణించారు. హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానే కాదు, ఇది దేశంలోనే అత్యంత కీలకమైన ఆర్థిక నగరం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇదే సందేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమ్మిట్‌కు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఐటీ (IT), ఫార్మా రంగాలలో హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఆయన ప్రస్తావించారు.

కేంద్రం చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధిని వివరిస్తూ, దేశంలో విమానాశ్రయాలను డబుల్ చేశాం. గ్రీన్‌ఫీల్డ్ హైవేలను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత బలోపేతం చేస్తున్నాం అని కిషన్ రెడ్డి అన్నారు. 'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో రాష్ట్రాల పాత్ర అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ పెట్టుబడులకు మరింత అనుకూలమైన వేదికగా మారుతుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories