Gadwal: భర్తపై వేడి నూనె పోసిన భార్య .. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Gadwal: భర్తపై వేడి నూనె పోసిన భార్య .. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
x
Highlights

Gadwal: కుటుంబ కలహాలతో భర్తపై వేడి నూనె పోసిందో భార్య.. ఐదు రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందిన భర్త నేడు మృతి చెందాడు.

Gadwal: కుటుంబ కలహాలతో భర్తపై వేడి నూనె పోసిందో భార్య.. ఐదు రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందిన భర్త నేడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్లెందొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పద్మ వెంకటేష్‌లకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అయితే.. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనెల 10వ తేదీ రాత్రి మరోసారి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.

ఈ క్రమంలోనే ఉదయం 5 గంటల సమయంలో నిద్రిస్తున్న భర్తపై వేడినూనె పోసింది భార్య. తీవ్ర గాయాలు కావడంతో.. కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులుగా చికిత్సపొందుతున్న వెంకటేష్.. మృతి చెందాడు. భార్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం పద్మను రిమాండ్‌కు తరలించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories