Adilabad: పెనుగంగా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే
Adilabad: డొల్లారా వద్ద పెనుగంగా నది వరద ఉధృతిని పరిశీలించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
Adilabad: పెనుగంగా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని పెనుగంగా నది ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు.
శుక్రవారం డొల్లారా వద్ద పెనుగంగా నది వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేపట్టిన రక్షణ చర్యలపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
Next Story




