Adilabad: ఆదిలాబాద్‌లో దారుణం స్కూటీ డిక్కీ తెరిచి రూ.3 లక్షలు చోరీ!

Adilabad: ఆదిలాబాద్ నేతాజీ చౌక్ మదీనా మసీదు వద్ద భారీ దొంగతనం జరిగింది. స్కూటీ డిక్కీలో పెట్టిన రూ.3 లక్షల నగదును గుర్తుతెలియని దొంగలు అపహరించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 24 Jun 2026 5:15 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో దారుణం స్కూటీ డిక్కీ తెరిచి రూ.3 లక్షలు చోరీ!

ఆదిలాబాద్: పట్టణంలో బుధవారం మధ్యాహ్నం భారీ దొంగతనం జరిగింది. తీర్పేల్లి కాలనీకి చెందిన ఇబ్రహీం (సోహెల్) బ్యాంకు నుంచి రూ.3 లక్షలు వితై చేసి, నేతాజీ చౌక్లోని మదీనా మసీదుకు వచ్చారు.

స్కూటీ డిక్కీలో నగదు ఉంచి నమాజ్కు వెళ్లి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు డిక్కీ తెరిచి డబ్బును అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story