Adilabad: ఆదిలాబాద్లో ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభల వాల్పోస్టర్ల విడుదల!
Adilabad: ఖమ్మంలో జరగనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) 4వ జాతీయ మహాసభల వాల్పోస్టర్లను ఆదిలాబాద్లో విడుదల చేశారు.
Adilabad: ఆదిలాబాద్లో ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభల వాల్పోస్టర్ల విడుదల!
Adilabad: ఈనెల 28, 29, 30 తేదీలలో ఖమ్మంలో జరగబోయే అఖిల భారత రైతు కూలి సంఘం(AIKMS) నాలుగవ జాతీయ మహాసభల వాల్ పోస్టర్ లను ఆదిలాబాద్ లో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం(AIKMS) రాష్ట్ర సహాయ కార్యదర్శి K సాయన్న మాట్లాడుతూ ఈ మహాసభలలో దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు, సంఘం జాతీయ నాయకులు హాజరవుతారు అన్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు నెలకొంది కావున అదిలాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు వాణిజ్య పంటలకు ఎకరాకు 20 వేల రూపాయలు, ఆహార పంటలకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలి. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తానన్న రాష్ట్ర ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలన్నారు.




