Bhainsa: బైంసాలో వైభవంగా గట్టు మైసమ్మ బోనాలు!
Bhainsa: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో కులమతాలకు అతీతంగా గట్టు మైసమ్మ బోనాల పండుగ. అమ్మవారిని దర్శించుకుని బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే రామారావు పటేల్.
Bhainsa: బైంసాలో వైభవంగా గట్టు మైసమ్మ బోనాలు!
Bhainsa: నిర్మల్ జిల్లా బైంసా పట్టణం లో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఆషాడ మాసం లో ఈ బోనాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. కులమతాలకు అతీతంగా బైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయం అంగరంగ వైభవంగా బోనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహానికి ధూపదీప నైవేద్యాలతో భాజా భజంత్రీలతో ప్రత్యేక పూజలను చేశారు.
బోనాల పండుగలు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ బైంసా మున్సిపల్ చైర్మన్ తుమ్మో ళ్ల దత్తాత్రి పాల్గొని బోనం ఎత్తుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పడాలని అమ్మవారిని కోరుకున్నట్లు వివరించారు. ఎల్ నీనో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉన్నాయి రైతులు ఆరుతడి పంటలను వేయాలని కోరారు.
Next Story




