Adilabad: 80 ఎకరాల్లో పంట దగ్ధం.. ప్రభుత్వం ఆదుకోవాలి!

Adilabad: బోథ్ మండలం కనుగుట్ట గ్రామంలో అగ్నిప్రమాదానికి గురైన పంట పొలాలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు.

NAGULA SATISH, BOATH
Published on: 5 May 2026 4:22 PM IST
Adilabad
X

Adilabad: 80 ఎకరాల్లో పంట దగ్ధం.. ప్రభుత్వం ఆదుకోవాలి!

Adilabad: బోథ్ మండలం కనుగుట్ట గ్రామంలో ప్రమాదవశత్తు కాలిపోయిన పంట పొలాలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు,ఏమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రమాదవశత్తు జరిగిన అగ్ని ప్రమాదానికి దాదాపు 80 ఎకరాల వరకు మక్కాజొన్న,జొన్న పంట,దీనితో పాటు 500 స్పింక్లర్ పైపులు.250 స్పింక్లర్లు పూర్తిగా కాలి భూడిది కావడం చాలా బాధాకరం అని అన్నారు,

రైతులు ఎవరు కూడా అధైర్య పడవద్దు అందరికి అండగా ఉంటాము అని అన్నారు ప్రభుత్వం కూడా స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అని అన్నారు. రైతులు ఆధైర్య పడొద్దు అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా పంట నష్టపరిహారం అందేవిధంగా చేస్తాను అని అన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story