Adilabad: పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నేత శ్రీకర్ గౌడ్ మండిపాటు

Adilabad: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీకర్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు.

NAGULA SATISH, BOATH
Published on: 17 May 2026 3:57 PM IST
Adilabad
X

Adilabad: పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నేత శ్రీకర్ గౌడ్ మండిపాటు

ఆదిలాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీకర్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా బీజేపీ రాజకీయం సాగుతోందని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు పెంచకుండా నాటకాలు ఆడి ప్రజలను ఆకర్షించి, ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలను పెంచడం ద్వారా సామాన్యులపై భారం మోపుతున్నారని ఆరోపించారు. ఇది ప్రజల నడ్డీ విరిచే విధానమని ఈ సందర్భంగా శ్రీకర్ గౌడ్ పేర్కొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story