Adilabad: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గుడిహత్నూర్ యువకుడి ఆల్ ఇండియా ర్యాంక్

Adilabad: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన ఓం ప్రసాద్ అద్భుత ప్రతిభ

NAGULA SATISH, BOATH
Published on: 1 Jun 2026 9:27 AM IST
Adilabad
X

Adilabad: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గుడిహత్నూర్ యువకుడి ఆల్ ఇండియా ర్యాంక్

Adilabad: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కఠినమైన జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన ముండే సంజీవ్ కుమారుడు ఓం ప్రసాద్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ పరీక్షలో ఓం ప్రసాద్ ఆల్ ఇండియా 2014వ ర్యాంక్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు దేశవ్యాప్తంగా ఇంతటి ఉత్తమ ర్యాంక్ సాధించడం పట్ల మండలంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

​ఐఐటీల్లో (IIT) సీటు సాధించడమే లక్ష్యంగా కష్టపడి చదివిన తన కొడుకు, ఈరోజు దేశంలోనే అత్యున్నత పరీక్షలో ఇంతటి విజయం సాధించడంపై తండ్రి ముండే సంజీవ్ తో పాటు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓం ప్రసాద్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై జిల్లా ప్రముఖులు, మండల ప్రజలు, స్నేహితులు మరియు బంధువులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.

​ఓం ప్రసాద్ పట్టుదల, కష్టపడే తత్వం మున్ముందు దేశానికి, పుట్టిన ఊరికి, కన్న తల్లిదండ్రులకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ.. ఆయనకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story