Boath: గ్రామాలకు ఆర్టీసీ బస్సులు పచ్చజెండా ఊపిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Boath: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకు కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 17 May 2026 12:58 PM IST
Boath
X

Boath: గ్రామాలకు ఆర్టీసీ బస్సులు పచ్చజెండా ఊపిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్: ఎర్ర బస్సు ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్. అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాలకు బస్సులు నడపాలని మంత్రి, ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా 11 బస్సులకు అనుమతి లభించిందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. ఆదివారం నెరడిగొండ నుంచి కుంటాల, నేరడిగొండ నుంచి బోథ్ (వయా వడూర్) వెళ్లే బస్సులను ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి ఎమ్మెల్యే ప్రయాణించారు.. ప్రయాణికులు, గ్రామీణ ప్రజలు ఈ ఆర్టీసీ బస్సు సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story