Nirmal: నిర్మల్లో వైభవంగా జగన్నాథ రథయాత్ర
Nirmal: నిర్మల్లో అత్యంత వైభవంగా జగన్నాథ రథయాత్ర. స్వామివారి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
Nirmal: నిర్మల్లో వైభవంగా జగన్నాథ రథయాత్ర
నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ మురళి కృష్ణ ఆలయం నుండి నిర్వహించిన జగన్నాథ రథ యాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ రథ యాత్రలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.స్వామివారి రథయాత్ర లో భక్తులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ రథ యాత్ర గాంధీ చౌక్ మురళి కృష్ణ ఆలయం నుండి బుధవార్ పేట్, పాత బస్టాండ్, వివేకానంద చౌక్, జయశంకర్ చౌక్, నగేశ్వర వాడ, చింతకుంట వాడ, టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు రితేష్ రాథోడ్, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, ముత్యం రెడ్డి, స్థానిక కౌన్సిలర్ లక్ష్మీ, పట్టణ కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




