Nirmal: నిర్మల్లో ఘనంగా సాయి సంకీర్తన.. భక్తుల ఇళ్లల్లో ప్రత్యేక పూజలు!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్లో సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో సాయి సంకీర్తన కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తుల ఇళ్లల్లో ప్రతి శనివారం ఈ పూజలు నిర్వహిస్తామని లక్కడి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
Nirmal: నిర్మల్లో ఘనంగా సాయి సంకీర్తన.. భక్తుల ఇళ్లల్లో ప్రత్యేక పూజలు!
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ బృందావన్ స్కూల్ ఎదురుగా గల సాయి భక్తుడు దొంతుల శాంతారావు నివాసంలో శనివారం సాయంత్రం సాయి సంకీర్తన కార్యక్రమం ఘనంగా జరిగింది. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సాయి పాదుకలు, సాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయిబాబా ఆశీర్వచనాలు ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండేవిధంగా సాయినాథుని చిత్రపటాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శనివారం సాయి భక్తుల ఇళ్లల్లో వారి కోరిక మేరకు సాయి సంకీర్తన, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు పండరి, ఉప్పుల నందు, రాజు, శ్రీనివాస్ వర్మ, రామరాజు, జిందం గోవర్ధన్, కోల శంకర్, రాజేష్, నారాయణరెడ్డి, సత్యం, కైలాసపతి, తిరుపతి, రేఖ, మాధవి తదితరులు పాల్గొన్నారు.




