Adilabad: జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి: ట్యాగ్స్ సచిన్ డిమాండ్

Adilabad: జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి, 1/70 చట్టాన్ని రక్షించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (ట్యాగ్స్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ డిమాండ్ చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 20 Sept 2026 2:36 PM IST
Adilabad
X

Adilabad: జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి: ట్యాగ్స్ సచిన్ డిమాండ్

Adilabad: జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని మరియు 1/70 చట్టాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (TAGS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లో ఆయన మాట్లాడారు.

ఇటీవల ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అసెంబ్లీలో జీవో నెంబర్ 3 పునరుద్ధరణ గురించి గళమెత్తడాన్ని వారు స్వాగతించారు. అయితే కేవలం మాట్లాడటమే కాకుండా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక కమిటీని నియమించాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆదివాసీలంతా పెద్దఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.