Amaravati: మంత్రి మండిపల్లిని కలిసిన కోన శశిధర్
Amaravati: అమరావతి సచివాలయంలో రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కోన శశిధర్.
Amaravati: మంత్రి మండిపల్లిని కలిసిన కోన శశిధర్
అమరావతి: రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ గారు సచివాలయంలోని మంత్రి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రవాణా శాఖ కార్యదర్శి శ్రీ కోన శశిధర్ గారికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు.
శాఖకు సంబంధించిన పలు అంశాలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఇరువురు చర్చించారు. ప్రజలకు మరింత మెరుగైన రవాణా సేవలు అందించే దిశగా సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
Next Story




